గాల్లోంచి అమాంతం ఎగిరిపడ్డ రాళ్లు.. పగిలిన తలలు.. ఇది ఇందిరాపార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ వద్ద సోమవారం కనిపించిన పరిస్థితి. ధర్నా చౌక్ ను పార్క్ వద్దే కొనసాగించాలని సీపీఐ, సీపీఎం నిరసనకారులు, వెంటనే తరలించాలని స్థానికులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పోటాపోటీ ఆందోళనతో రణరంగంగా మారింది. ఈ క్రమంలో పరిస్థితి అదుపుతప్పి ఒకరిపై ఒకరు కొట్టుకునేదాకా వెళ్లింది.
తొలుత శాంతియుతంగా ఇరు వర్గాలకూ తమ నిరసనను తెలుపుకునేందుకు పోలీసులు అనుమతించగా, ఒకే సమయంలో ధర్నా చౌక్ వద్దకు చేరిన ఇరు వర్గాలు, ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. జండా కర్రలతో తమపై దాడులు చేశారని స్థానికులు, బయటి నుంచి గూండాలను తెప్పించి తమపై రాళ్లను రువ్వారని అఖిలపక్షాలు పరస్పరం ఆరోపించుకున్నారు. వారి మధ్య వాగ్వాదం, తోపులాటలతో మొదలైన గొడవ, ఆపై రాళ్లు రువ్వుకునే వరకూ వెళ్లింది.
ఎవరినీ అరెస్టులు చేయవద్దని ముందే పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందగా, అక్కడ మోహరించిన పోలీసులు ఈ దాడులను చూసీ చూడనట్టు వదిలేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంకో పక్క ధర్నా చౌక్ ఉండాల్సిందేనని డిమాండ్ చేస్తూ, కొద్దిసేపటి క్రితం జనసేన కార్యకర్తలు, తమ జెండాలతో ఇందిరా పార్కు వద్దకు చేరుకున్నారు. స్థానికులమని చెప్పుకుంటున్న వారికి మద్దతుగా టీఆర్ఎస్ నేతలు, గూండాలను పంపుతున్నారని వామపక్షాలు ఆరోపిస్తుండగా, అసలు ఈ ప్రాంతంతో ఎంతమాత్రమూ సంబంధం లేని వారు వచ్చి, తమపై గూండాగిరి చేసి దాడి చేశారని స్థానికులు ఆరోపించారు.
ఇక ధర్నా చౌక్ నగరం మధ్యలో ఉంటేనే నిరసనలు తెలిపే సామాన్యులకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని తమ నేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేసిన నేపథ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపేందుకే వచ్చినట్టు జనసేన కార్యకర్తలు చెబుతున్నారు. నిరసనలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కూడా జనసేన కార్యకర్తలు తరలిరావటం విశేషం. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించామని, ఇరు వర్గాలనూ వేరు చేసి బందోబస్తును పెంచి పరిస్థితిని అదుపులోకి తెచ్చామని అధికారులు వెల్లడించారు. అసలు నిరసన కార్యక్రమం ఉదయం 11 గంటల తరువాతే ఉండటంతో ఎటువంటి పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా అదనపు బలగాలను మోహరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more