బీజేపిలోనే అవినీతిపరులు వున్నారంటూ.. ఆ పార్టీ మొత్తం అవినీతిమయమైందని అరోపణలు సంధించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆ పార్టీపై దాడిని కూడా ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా కేంద్రమంత్రి అనంతకుమార్, బీజేపి కర్ణటాక అధ్యక్షుడు యడ్యూరప్పలు హైకమాండ్ కు ముడుపులు ముట్టజెప్పామన్న వీడియో క్లిపులపై ఏకంగా న్యాయస్థానాన్ని అశ్రయించి న్యాయపోరాటం కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక మరో బీహార్ లా తయారవుతుందంటూ కేంద్రమంత్రి నిర్మాల సీతారమన్ చేసని వ్యాఖ్యలపై కూడా ఆయన ధీటుగా బదులిచ్చారు.
కర్ణాటక రాష్ట్రంలో న్యాయవ్యవస్థ చాలా పటిష్టంగా వుందని, ఇక్కడి నుంచే ఎంపీగా ఎంపికైన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రంలో న్యాయవ్యవస్థ ఎలా వుందో ముందుగా అవగాహన పెంచుకోవాలని ఆ తరువాత అమె విమర్శలు చేయాలని ఆయన మైసూరులో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. రాష్ట్రంలో చట్టం కూడా పకడ్బంధీగా అమలు చేస్తుండడం వల్లే అనేక పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని, ఇంకా అనేక సంస్థలు అసక్తిని కూడా కనబరుస్తున్నాయన్న విషయాన్ని తెలుసుకోవాలని కేంద్రమంత్రి తెలుసుకోవాలని ముఖ్యమంత్రి అప్నారు. ఇక యడ్యూరప్ప రాష్ట్ర పర్యటనపై కూడా ఆయన తనదైన శైలిలో చమత్కరించారు. రాష్ట్ర ప్రజలు ఆయన ఐదేళ్ల పాలనలో అనుభవించిన కష్టనష్టాలను అంత సులువుగా మర్చిపోలేరని వ్యంగోక్తి విసిరారు. ముఖ్యమంత్రిగా కొనసాగుతూ అవినీతిలో కూరుకుని జైళ్లకు వెళ్లిన వ్యక్తిని ప్రజలు ఎలా అదరిస్తారని ఆయన ప్రశ్నించారు.
కర్ణాటలో బీజేపి ఐదేళ్ల కాలం అధికారంలో వుండగా, ఎన్ని చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరిగాయో కూడా అమె ఒక్కసారి గుర్తుతెచ్చుకోవాలని సూచించారు. అదే సమయంలో కరువు నిధులపై కేంద్రం విడుదల చేసిన పరిహార నిధులపై శ్వేతపత్రాన్ని చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. వర్షాల కొరతతో ఖరీఫ్ సీజన్ లో చోటుచేసుకున్న పంట నష్టాలతో పాటు రబీ సీజన్ పంట నష్టాలకు కలపి 8వేల కోట్ల రూపాయలను కేంద్ర విడుదల చేయాలని ఆయన కేంద్రాన్ని కోరుతామన్నారు. ఇప్పటివరకు బీజేపి ప్రభుత్వం కేవలం 1670 కోట్ల రూపాయలను మాత్రమే విడుదల చేసిందని చెప్పారు. తమ ప్రభుత్వంపై పనిగట్టుకుని విమర్శలు చేస్తున్న బీజేపి నేతలు నిజంగా రాష్ట్రాభివృద్దిని కాంక్షించే వారైతే.. రాష్ట్రానికి కరువు పరిహార నిధులను విడుదల చేయాంచాలని, ఈ మేరకు కేంద్రంపై ఒత్తిని తీసుకురావాలని ఆయన సూచించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more