తన ప్రియుడితో పెళ్లి చేయాలని డిమాండ్ చేస్తూ ఓ వివాహిత సెల్ టవర్ ఎక్కిన ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. తన ప్రియుడితో పెళ్లి చేయకపోతే తాను దూకి చనిపోతానని బెదిరింపులు కూడా పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన అదికారులు ఘటనాస్థలానికి చేరుకుని వివాహిత డిమాండ్లకు అంగీకరించారు. అమెకు అన్ని విధాల నచ్చజెప్పి చాకచక్యంగా సెల్ టవర్ దిగేలా చర్యలు తీసుకున్నారు. దీంతో వివాహిత సెల్ టవర్ నుంచి కిందకు దిగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఆ మహిళను పోలీసుస్టేషనుకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు.
వివాహిత మహిళను పోలీసులు మహిళా పోలిస్ స్టేషన్ కు తరలించి.. అమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ ఘటన గుంటూరు జిల్లా శావల్యాపురం మండలంలోని కనమర్లపూడి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్సీ కాలనీకి చెందిన ముట్లూరి లాజరు.. కుటుంబ సభ్యులు జీవనోపాధి నిమిత్తం కర్నూలు జిల్లాకు వెళ్లి అక్కడ పనులు చేసి తిరిగి తమ స్వగ్రామానికి వస్తుంటాడు. అక్కడ ఆయనకు ముస్లిం వివాహిత పఠాన్ షాహీనీతో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరి మధ్య ప్రేమ వికసించింది.
కర్నూలు జిల్లాలో పనులు ముగియడంతో లాజరు తన తల్లిదండ్రులతో పాటు గుంటూరులోని స్వగ్రామానికి చేరుకున్నాడు. అతనితో పాటు వివాహిత షాహీనీని కూడా గుంటూరు తీసుకొచ్చాడు. అప్పటికే ఆమె తన భర్తతో వచ్చిన విభేదాల కారణంగా ఆయనతో దూరంగా వుంటుంది. దీంతో వీరు అక్కడే సహజీవనం కూడా చేశారు. అయితే తనను పెళ్లి చేసుకోవాలని లాజరుని షాహీని డిమాండ్ చేసింది. భర్త నుంచి విడాకులు తీసుకొని వస్తేనే పెళ్లి చేసుకుంటానని లాజరు ఆమెకు చెప్పాడు. దీంతో దిక్కుతోచని షాహీనీ సెల్టవర్ ఎక్కి లాజరుతో పెళ్లి చేయాలన్న డిమాండ్ తో హల్ చల్ చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more