సిరియా వైమానిక స్థావరంపై క్షిపణి దాడితో విధ్వంసం సృష్టించిన అమెరికా, ఈసారి ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ స్థావరం లక్ష్యంగా అతిపెద్ద బాంబు దాడి చేసింది. అప్ఘనిస్తాన్ లోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న పక్కా సమాచారంతో ఐఎస్ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా ద్రోణి దాడికి పాల్పడింది. అణు రహిత దాడికి పాల్పడినా.. అనేక మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్రాణాలను మాత్రం ఈ బాంబు బలిగొనింది. అయితే విచారకరమైన విషయం ఏమిటంటే ఈ దాడిలో కేరళకు చెందిన యువకుడు కూడా ప్రాణాలను కోల్పోయాడు.
కేరళలో మాయమై, ఆపై ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల్లో చేరిపోయాడని భావిస్తున్న కేరళకు చెందిన యువకుడు, ముర్షిద్ మహమ్మద్ కూడా అమెరికా జరిపిన జీబీయూ - 43 బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఆఫ్గన్ లోని నన్గాన్హర్ ప్రావిన్స్ పరిధిలోని అచిన్ జిల్లాపై ఈ మెగా బాంబ్ స్ట్రయిక్ జరుగగా, ఇస్లామిక్ తీవ్రవాదులతో అక్కడి స్థావరంలోనే వుంటున్న కేరళవాసి ముర్షిద్ మహ్మమద్ కూడా మరణించాడని తెలుస్తుంది.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదల రచనలతో ప్రభావితం చెంది మధ్యప్రాశ్చానికి వెళ్లి అక్కడి నుంచి సిరాయాకు వెళ్లి ఉగ్రవాద సంస్థలో చేరిన ముర్షిద్ ఈ దాడిలో మరణించాడని పాడ్నాకు చెందిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కు చెందిన నేత అబ్దుర్ రహీమాన్ తెలిపాడు, ఈ మేరకు తనకు సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్ ద్వారా ఎస్ఎంఎస్ వచ్చిందని తెలిపాడు. అయితే ముర్షిద్ ఏ రోజున మరణించాడన్న విషయాన్ని మాత్రం తాను చెప్పలేకపోతున్నానన్నిని, ఎస్ఎంఎస్ వచ్చింది నమ్మదగిన సోర్సు నుంచి కాదని అన్నాడు.
అయితే కేరళలోని చండేరా పోలీసులు మాత్రం ఈ విషయాన్ని దృవీకరించడం లేదు. ముర్షిద్ మహమ్మద్ మరణించాడని విషయమై తమకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు. అయితే ముర్షిద్ మహమ్మద్ మరణించాడన్న వార్త నిజమేూ అయితే తమకు భారత విదేశాంగ శాఖ నుంచి అధికారకంగా సమాచారం అందుతుందని, అప్పటి వరకు తాము వేచిచూస్తామని చెప్పారు. కాగా, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో కేరళలోని కసార్ గోడ్ ప్రాంతానికి చెందిన హఫీసుద్దీన్ తేకే మరణించినట్టు కూడా వార్తలు వచ్చాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more