వీధి కుక్కలు ప్రజల పాలిట శాపంగా పరిణమిస్తున్నాయని, ప్రజలపై విరుచుకుపడి గాయపరుస్తున్నాయని అరిచిన ఆ నోళ్లు.. అక్కడి సిసిటీవీ ఫూటేజీలో నిక్షిప్తమైన వీడియోను చూసి ఒక్కసారిగా మూగబోయాయి. తమ ప్రాణాలను బలిగోనేందుకు వచ్చిన వన్యజీవిని తరమిని గ్రామసింహాలను కాదు కాదు కాలనీ సింహాలను ప్రశంసిస్తున్నారు. స్టానబలం అంటే ఏమిటో ఇప్పడు చిరుతకు తెలిసివచ్చింది. అడవిలో అత్యంత వేగంగా పరిగెత్తి వన్యప్రాణులను వెంటాడి.. వేటాడి తన ఆకలిని తీర్చుకునే చిరుత.. జనారణ్యంలో మాత్రం శునకాల చేతిలో తోడముడుచుకోవాల్సి వచ్చింది. గత్యంతరం లేక చివరకు పలాయనం చిత్తగించింది.
ముంబైలోని గోరెగావ్లో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన సీసీ కెమేరాల్లో నమోదవటంతో వెలుగుచూసింది. ముంబయి శివారు గోరెగావ్, గిరికుంజ్, దిందోషి హౌసింగ్ సొసైటీలు సంజయ్గాంధీ నేషనల్ పార్క్ సమీపంలో ఉన్నాయి. నగరశివారులో ఉన్న ఈ జనావాసాల్లోకి తరచూ చిరుత పులులు, ఇతర వన్యప్రాణాలు వస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో కంచెలు, రాత్రి సమయాల్లో భారీ వీధి దీపాలను ఏర్పాటు చేశారు. అయితే, కాలనీల చివరన చెత్తకుప్పల వద్ద గుమిగూడే కుక్కలను తినేందుకు తరచూ చిరుత పులులు వచ్చి వాటిని అహారంగా చేసుకుంటున్నాయి.
అదే తరహాలో మంగళవారం రాత్రి 3గంటల సమయంలో ఒక చిరుత వచ్చి ఒంటరిగా ఉన్న వీధి కుక్కపై దాడి చేసి కొద్ది దూరం లాక్కెళ్లింది. చిరుత నుంచి తప్పించుకున్న ఆ శునకం ఎదురు తిరగింది. ప్రాణరక్షణ కోసం అరవటంతో సమీపంలోని ఇతర వీధికుక్కలూ అక్కడకు చేరుకున్నాయి. అవన్నీ సమష్టిగా వెంటపడటంతో చిరుత పారిపోయింది. సీసీటీవీలో నమోదైన దృశ్యాలను అటవీశాఖ బృందం తిలకించింది. చిరుతను ఎదిరించిన కుక్కను రాఖీగా గుర్తించారు. ఈ ఘటన అనంతరం స్థానికులు ఆ శునకాన్ని ‘టైగర్’గా పిలుచుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more