హైదరాబాద్ లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా జరుగుతున్న భారత్-బంగ్లాదేశ్ టెస్టు మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్ మెన్లు నిలకడగా రాణిస్తున్నారు. క్రీజులో వున్న మురళీ విజయ్, చత్తీశ్వర్ పూజారాలిద్దరూ అర్థశతకాలను నమోదు చేసుకుని స్కోరు బోర్డును ముందుకు నడిపిస్తున్నారు. అదిలోనే అతిథ్య జట్టుకు కె ఎల్ రాహుల్ లభించడంతో మంచి జోష్ మీద కనిపించినా.. ఆ తరువాత వారు భారత బ్యాట్స్ మెన్లపై పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. మొదటి ఓవర్ లోనే రెండు పరుగులు వద్ద కెఎల్ రాహుల్ బంగ్లా బౌలర్ తస్కిన్ అహ్మద్ ఓవర్లో తన వికెట్ ను చేజార్చుకున్నాడు.
దీంతో క్రీజులోకి వచ్చిన చత్తీశ్వర్ పూజరా.. మురళీ విజయ్ తో కలసి స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. ఆరు ఓవర్ల వద్ద 13 పరుగులతో వున్న టీమిండియా.. లంచ్ విరామ సమయానికి 86 పరుగులకు చేరకుంది. ఆ తరువాత ఇద్దరు బ్యాట్స్ మెన్లు నిలకడగా రాణించడంతో 34 ఓవర్లకు ఇద్దరు బ్యాట్స్ మెన్లు అర్థశతకాలను నమోదు చేసుకున్నారు. 34వ ఓవర్లో బౌండరీని బాదిన మురళీ విజయ్ తన టెస్టు కెరీర్ లో 15వ అర్థశతకాన్ని నమోదు చేశాడు. దీంతో ఇద్దరు బ్యాట్స్ మెన్ల మధ్య కూడా వంద పరుగులు భాగస్వామ్యం ఏర్పడింది.
ఆ తరువాత అదే ఓవర్లో చత్తీశ్వర్ పూజారా కూడా అర్థసెంచరీని నమోదు చేశాడు,. తన టెస్టు కెరీర్ లో 12వ అర్థశతకంతో రాణించాడు. దీంతో 34 ఓవర్లలో వికెట్ నష్టానికి 115 పరుగులు సాధించిన టీమిండియా జోడి.. 43 ఓవర్ల అనంతరం డ్రింక్స్ సమయానికి వికెట్ నష్టానికి 146 పరుగులు సాధించింది. దీంతో భారీ స్కోరు దిశగా టీమిండియా పయనించడం గ్యారంటీ అని విశ్లేషకులు బావిస్తున్నారు. బ్యాటింగ్ అర్డర్ లో విరాట్ కోహ్లీ, రహానే, వృద్దిమాన్ సాహ, అశ్విన్, జడేజాలు వుండటం టీమిండియాకు మరింత కలిసివస్తుందని అంచనా.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more