కేంద్ర ప్రభుత్వం నుంచి మీ మొబైల్ ఫోన్ కు టెక్ట్స్ మెసేజ్ వచ్చిందా..? మాకు రాలేదే.. ఏంటా మెసేజ్..? దాని సారంశంమేంటి..? అని అడుగుతున్నారా..? మెసేజ్ రాకపోతే మీకేం పర్వాలేదు. అయితే ఈ మెసేజ్ అందుకున్న వారు మాత్రం తప్పనిసరిగా ప్రభుత్వానికి వివరణ ఇవ్వాలి. మెసేజ్ ఏంటని అడుగుతుంటే ఇదంతా చెబుతారేం..? అక్కడికే వస్తున్నాం. డీమానిటైజేషన్ అదేనండీ పాత పెద్ద నోట్ల రద్దు చేసిన గత ఏడాది నవంబర్ 8 తరువాత నుంచి డిసెంబర్ 31 వరకు బ్యాంకుల్లో పాత పెద్ద నోట్లను డిపాజిట్ పెద్ద మొత్తంలో చేసిన వారందరికీ ప్రభుత్వం టెక్ట్స్ మెసేలు పంపింది.
పెద్ద నోట్ల రద్దు తరువాత ఎవరి ఖాతాల్లో ఎంత డబ్బు జమైందన్న వివరాలను తెలుసుకునేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు కొత్త సాఫ్ట్ వేర్ ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా 5 లక్షలకు మించి తమ ఖాతాల్లో పాత నోట్లను జమచేసిన వారిందరికీ నోటీసులను పంపింది. పెద్ద నోట్ల రద్దు తరువాత దాదాపు 18 లక్షల మంది సుమారు రూ.4.17 లక్షల కోట్ల అనుమానాస్పద డిపాజిట్లు చేసినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ సుశీల్ చంద్ర తెలిపారు.
ఆదాయపన్ను శాఖ అధికారుల వద్దనున్న సమాచారం ప్రకారం 13 లక్షల మందికి ఇప్పటికే నోటీసులు పంపామని, మిగిలిన 5 లక్షల మందికి కూడా త్వరలో పంపుతున్నామని చెప్పారు. వీటితో పాటుగా మరో పది లక్షల మంది అకౌంట్లను కూడా పరిశీలిస్తున్నామని, వారిలో అనుమానాస్పందంగా తేలిన వారికి కూడా త్వరలో నోటీసులను పంపనున్నట్లు తెలిపారు. అనుమానాస్పద డిపాజిట్లకు సంబంధించి మెసేజ్ అందుకున్నవారు 10 రోజుల్లో సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని చంద్ర స్పష్టం చేశారు. వీరందరూ తమ ఆదాయాలకు, డిపాజిట్లకు సంబంధించి లెక్కలు చెప్పాల్సిందేనని పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more