భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్లమెంటు సభ్యుడు వినయ్ కతియార్ చేసిన అభ్యంతకర వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తనయ ప్రియాంక గాంధీ స్పందించారు. కతియార్ వ్యాఖ్యలు బీజేపీ నేతల మైండ్ సెట్ ను తెలియజేస్తున్నారని అన్నారు. మహిళలపై కమలం నాయకుల వైఖరికి ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు. మహిళలంటే చులకన భావమున్న నేతలే ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేసి పబ్లిసిటీ కోసం పాకులాడుతారని చురకలంటించారు. బీజేపి పార్టీలో వున్న మహిళలకు కూడా వర్తించేలా ఎంపీ చేసిన వ్యాఖ్యలను పలు రాష్ట్రాల్లోని మహిళా కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు.
అంతకు ముందు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని పరితమంచే పార్టీకి చెందిన ఎంపీ వినయ్ కటియార్ విజ్ఞత మరిచి ప్రియాంకా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. యత్రనార్యంతు పూజ్యంతే తత్ర రమ్యతే దేవతాం అన్న సూక్తిని కూడా మర్చిన నేత.. ఆడవారిని కేవలం అందమైన వస్తువులుగానే పరిగణించే విధంగా దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక కంటే అందమైన మహిళలు చాలా మంది ఉన్నారని.. ఆమె కంటే యాక్టర్లు, ఆర్టిస్టులు అందంగా ఉంటారని నోటికొచ్చినట్టు మాట్లాడారు. తమ పార్టీలో అందమైన స్టార్ క్యాంపెయినర్లు చాలా మంది ఉన్నారని చెప్పుకొచ్చారు.
ఉతర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచార బాద్యతలను నిర్వహించనున్న వారి జాబితాను నిన్న రాత్రి కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. దీంతో స్టార్ క్యాంపెయినర్ గా ప్రియాంక గాంధీ పాల్గొంటున్నారన్న విషయాన్ని జీర్ణించుకోలేక బీజేపి ఎంపీ వినయ్ కటియార్ అభ్యంతరకర వ్యాక్యలు చేశారు. తమ పార్టీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఉన్నారని, అమె మాట్లాడితే జనం కూడా అధికంగా వస్తారని అమె ప్రియాంక కన్నా చాలా అందంగా వుంటారని కూడా వ్యాఖ్యలు చేశారు. అయితే కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా ప్రియాంక రావడం హర్షించదగ్గ పరిణామమని నేషనల్ కాంగ్రెస్ పార్టీ పేర్కోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more