తెలుగు రాష్ట్రాల్లో చేనేత కార్మికుల దీనస్థితికి జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ చలించాడు. చేనేతకు చేయూత నిచ్చేందుకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు. తెలంగాణ చేనేత అఖిల పక్షం ఐక్య వేదిక, ఏపీ చేనేత కార్మిక సంఘం సభ్యుల బృందం సంయుక్తంగా హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ ని కలిసింది. తెలుగు రాష్ట్రాల్లోని చేనేత కార్మికుల ఆకలి చావులను ఈ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వచ్చే నెలలో గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించనున్న ‘చేనేత సత్యాగ్రహం’ కార్యక్రమానికి రావాలని పవన్ ని వారు ఆహ్వానించగా, పవన్ అందుకు అంగీకరించాడు. చేనేత కుటుంబాల కష్టాలను తీర్చేందుకు తన వంతు కృషి చేస్తానని, నేత కళను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, పవన్ ప్రకటించాడు.
తెలంగాణ రాష్ట్రంలో ఈ రెండున్నరేళ్లలో 43 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. కార్మికుల జీవన పరిస్థితులు మెరుగు పరిచేందుకు సహరించాలని కోరారు. దేశవ్యాప్తంగా చేనేత పాలసీని తీసుకొచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు గాను చేనేత వస్త్రాలకు ప్రాచుర్యం కలిగించేలా ప్రచారకర్తగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన పవన్ కల్యాణ్ ప్రచారకర్తగా వ్యవహరించేందుకు సిద్ధమని తెలిపారు.
చేనేత మన జాతి సంపద అని, కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రయత్నిస్తానని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగానే చేనేత కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, కొద్దిరోజుల క్రితం తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ పలువురు సెలబ్రిటీలకు చేనేతకు చేయూతనివ్వాలని పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే.
పోలవరం బాధితులకు అపాయింట్ మెంట్..
మరోవైపు పోలవరం ముంపు బాధితులున కలిసేందుకు పవన్ అపాయింట్ మెంట్ ఇచ్చాడు. మూలలంక గ్రామస్థులు అధికారుల ఆగడాలపై పోరాటం చేస్తున్నారు. అయితే వారి ఆవేదన అరణ్యరోదన కావడంతో పవన్ కల్యాణ్ సహాయం కోరారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ వారికి అపాయింట్ మెంట్ ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు వారు పవన్ కల్యాణ్ ను జనసేన కార్యాలయంలో కలవనున్నారు. డంపింగ్ యార్డు నిర్మాణం పేరిట తమ నుంచి 203 ఎకరాల భూమిని బలవంతంగా సేకరిస్తున్నారని మూలలంక గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. తమ భూములు తమకు కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more