విజయవాడలో ఇవాళ ఉదయం ఉద్రిక్త వాతావరణం అలుముకుంది. నగరంలోని సింగ్ నగర్లో వంగవీటి రంగా విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్ర ధ్వంసం చేశారు. ఈ ఉదయం విషయం తెలుసుకున్న వంగవీటి రంగా అభిమానులు, వంగవీటి రాధా వర్గీయులు నిరసనలకు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రజల మనోభావాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని, నేతల సహకారంతోనే ఇంత దారుణానికి ఒడిగట్టారని అందోళనకారులు ఆరోపించారు.
ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో రంగా అభిమానులు పెద్దఎత్తున అక్కడకు చేరుకుని ధర్నాకు దిగారు. రంగా విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని, రంగా విగ్రహాన్ని యథావిధిగా ప్రతిష్టించాలని వారు డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళవకారులకు నచ్చచెప్పారు. విగ్రహాన్ని కూల్చిన దుండగులను కనిపెట్టేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారని వెల్లడించిన ఆయన, ఈ పనికి పాల్పడ్డవారిని ఊరికే వదలబోమని అన్నారు.
టీడీపీ హయాంలో విగ్రహాల ధ్వంసం పెరిగిపోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ అరోపించారు. ఘటనా స్థలానికి వచ్చి ధ్వంసమైన రంగా విగ్రహాన్ని పరిశీలించిన వంగవీటి రంగా తనయుడు రాధా అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విగ్రహ ధ్వంసానికి పాల్పడినవారిని తక్షణమే అరెస్ట్ చేయాలని రాధాకృష్ణ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more