నకిలీ కరెన్సీతో దేశంలో శాంతిభద్రతలకు విఘాత్నం కల్పిస్తున్న తీవ్రవాద శక్తులకు, దేశంలోకి చోచ్చుకువచ్చి ప్రజల ప్రాణాలను బలిగొంటున్న ఉగ్రవాదులకు కళ్లెం వేశామని స్వయంగా దేశ ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన నేపథ్యంలో పాకిస్తాన్ సహా బంగ్లాదేశ్ కూడా మన దేశానికి సంబంధించిన కొత్త కరెన్సీని ఎట్టి పరిస్థితుల్లో ముద్రించలేదని ధీమా వ్యక్తం చేశారు. అయితే ప్రధాని చెప్పినట్లుగానే అంతా జరిగితే బాగానే వుండు. కానీ ఏకంగా దేశంలోని కొందరు అగంతకులు మాత్రం ప్రధానికి, దేశ అర్థికాభివృద్దికి సవాల్ విసురుతున్నారు.
నకిలీ కరెన్సీ, అంతర్గత తీవ్రవాదం, ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త కరెన్సీ తీసుకొస్తే.. దానికి ఎక్కడో దేశ సరిహద్దుల అవల కాకుండా.. దేశంలోనే అగంతకులు నకిలీవి సృష్టిస్తున్నారు. రెండు వేల రూపాయల నోటును గతేడాది నవంబర్ 10 విడుదల చేయగా, విడుదలైన రెండో రోజేనే డూప్లికేట్ తయారుచేశారు కేటుగాళ్లు. మన వద్దు రాచకొండ కమీషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నంలో కూడా నకిలీనోట్ల ముఠాను పట్టుకుని వారి నుంచి ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
ఏకంగా బ్యాంకు ఏటీయంలోనూ కొత్త 2000 రూపాయల నోటు బయటపడటంతో దానిని తాత్కాలికంగా బంద్ చేశారు. ఒకరు కలర్ జిరాక్స్ తో నకిలీ నోట్లు ముద్రిస్తుండగా, మరోకరు మరో విధంగా నకిలీ నోట్లను ముద్రిస్తున్నారు. దేశ ప్రజలకు ఇప్పటికీ కొత్త నోట్లపై సరైన అవగాహన లేకపోవడంతో ఫేక్ నోట్ల చలామణి ఈజీగా అవుతుందని కేటుగాళ్లు బావిస్తున్నారు. కాగా, నకిలీ కరెన్సీ భారీ మొత్తంలో బయటపడిన సందర్భాలు మాత్రం అరుదు. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం ఉదయం ఓ ముఠాను పట్టుకున్న పోలీసులు.. వారి నుంచి ఏకంగా రూ.6.1 లక్షల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఢిల్లీ వీధుల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని, బ్యాగులు పరిశీలించగా భారీగా కొత్త నోట్లు కనిపించాయని, అయితే అదంతా నకిలీ కరెన్సీయేనని నిర్ధారించుకున్న వెంటనే ఇద్దరినీ అరెస్ట్ చేశామని పోలీసులు మీడియాకు వెల్లడించారు. సెక్యూరిటీ ఫీచర్లతో తయారైన కొత్త నోట్లు మార్కెట్లోకి విడుదలైన(నవంబర్ 10) ఢిల్లీలో నకిలీ కరెన్సీ ఇంత మొత్తంలో పట్టుబడటం ఇదే మొదటిసారి. ప్రధాని నుంచి ఉత్తమ ఇంజనీరుగా అవార్డును అందుకున్న మొహాలీకి చెందిన ఇంజనీర్ నుంచి స్వాధీనం చేసుకున్న రూ.42లక్షలే భారీ మొత్తం కాగా, రాజ్కోట్లోనూ రూ.26 లక్షల ఫఏక్స్ కరెన్సీ ఈ తరువాతది.. ఈ రెండింటి తర్వాత ఇవాళ ఢిల్లీలో లభ్యమైన రూ.6.1 లక్షలే భారీ ఫేక్ కరెన్సీగా నమోదైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more