తమిళనాట నేడు రసవత్తరమైన పరిణామాలు జరగబోతున్నాయి. ఒకటి చిన్నమ్మ శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవటం, రెండోది జయలలిత మరణంపై మద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టడం. శశికళ ఎంపిక ఏకగ్రీవం కాగా, అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం చెన్నైలోని టీటీడీ కళ్యాణమండపంలో ఇప్పటికే ప్రారంభం అయ్యింది కూడా. ఇక దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను నేడు మద్రాసు హైకోర్టు విచారించనుంది.
జయ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని, ముగ్గురు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలతో కమిటీ ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపించాలని కోరుతూ చెన్నైలోని అరుంబాకంకు చెందిన జోసెఫ్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జయలలిత ఆస్పత్రిలో చేరిన తర్వాత ఏం జరిగిందన్న దానిపై ప్రజల్లో పలు అనుమానాలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు. సెప్టెంబరు 22న జయ ఆస్పత్రిలో చేరినప్పుడు రెండు రోజుల్లో ఆమెను డిశ్చార్జి చేయనున్నట్టు చెప్పారని గుర్తు చేశారు.
తొలుత జ్వరం కారణంగా జయను ఆస్పత్రిలో చేర్చారని, రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తారని వార్తలు వెలువడ్డాయని తెలిపారు. అయితే అది జరగలేదని, ఆమె ఆరోగ్యం క్షీణించిందని చెబుతూ అపోలో ఆస్పత్రి వారు బులిటెన్లు విడుదల చేశారన్నారు. జయ దేహాన్ని చూసిన వారు ఆమె రెండు కాళ్లు తొలగించినట్లు గమనించారని, ఆమె దేహం ఎక్కువ రోజులు చెడకుండా ఉండేందుకు ఆస్పత్రి వర్గాలు ఈ రీతిలో చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోందన్నారు.
అయితే జయ మృతిపై అనుమానాలున్నాయని, ఏం జరిగిందనే వాస్తవం ప్రజలకు తెలియదని పేర్కొన్నారు. కాబట్టి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులతో విచారణ జరిపించాలని కోరారు. దీంతో ఏం జరగబోతుందా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more