వరుసగా తగులుతున్న దెబ్బలు పటేల్ ఉద్యమ నేత హర్దిక్ ను కోలుకోకుండా చేస్తున్నాయి. దేశ ద్రోహం ఆరోపణలపై అరెస్టయి జైలు జీవితం గడిపి, ఆపై ఆర్నెల్ల బహిష్కరణతో బయటికి వచ్చాడు. ప్రస్తుతం ఉదయ్ పూర్ లో ఉంటున్న హర్దిక్ బీజేపీని ఇరుకున పెట్టేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాడు. ఇంతలో అనుకోని షాక్ అతనికి తగిలింది.
ఉద్యమ సమయంలో హర్దిక్ పటేల్ అనుచరులుగా వ్యవహరించిన వారే ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. అతని వెన్నంటె ఉన్న చిరాగ్, కేతన్ లు ఇప్పుడు సంచలన ఆరోపణలు చేశారు. తన స్వార్థం కోసమే హర్దిక్ పటేల్ ఉద్యమం లేపాడని వారు ఆరోపించారు. తాను ఒక్క ఏడాది కాలంలోనే నాయకుడిగా ఎదగాలని, దాంతోపాటు కోటీశ్వరుడిని కావాలనే ఉద్దేశంతోనే ఆ ఉద్యమం మొదలుపెట్టాడని అంటున్నారు. దీనిపై హార్దిక్ ను ఉద్దేశించి ఏకంగా ఓ బహిరంగ లేఖ రాయటం విశేషం.
''మీరు నాయకుడిగా ఎదగాలని, భారీ మొత్తంలో డబ్బు కూడగట్టుకోవాలని స్వార్థంతో వ్యవహరించారు. దానివల్ల పటేల్ వర్గంతో పాటు మన సంస్థకు కూడా భారీ నష్టం జరిగింది'' అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినవాళ్ల కుటుంబాలను ఆదుకోవాల్సింది పోయి హార్దిక్, ఆయన స్నేహితులు విలాసవంతమైన జీవితం గడిపారని, అమరులకు సాయం చేయడానికి సేకరించిన విరాళాలతో హార్దిక్, ఆయన మామ విపుల్భాయ్ ఖరీదైన కార్లు కొన్నారని ఆరోపించారు. సాధారణంగా జైలుకు వెళ్లారంటే నోట్లోకి నాలుగు వేళ్లు వెళ్లడమే కష్టమని, కానీ హార్దిక్ మాత్రం జైలుకు వెళ్లిన తర్వాత కోటీశ్వరుడు అయ్యాడని చిరాగ్, కేతన్ అంటున్నారు.
గతంలో హార్దిక్ పటేల్కు కుడి, ఎడమ భుజాలుగా ఉన్న చిరాగ్ పటేల్, కేతన్ పటేల్ ఈ విషయాలు వెల్లడించడంతో హర్దిక్ అసలు స్వరూపం ఇదేనంటూ బీజేపీ దుమ్మెత్తి పోస్తుంది. గతంలో హర్దిక్ నియంతలా వ్యవహరిస్తున్నాడని ఫక్రుద్దీన్ అనే మరో నేత ఆరోపించిన సంగతి తెలిసిందే. వ్యవహారం మానకపోతే అతడి చీకటి నిజాలను బయటపెడతామని అప్పట్లో ఆయన హెచ్చరించారు కూడా.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more