దాయాధి దేశం పాకిస్థాన్ మన దేశంలోని కాశ్మీర్ లో విధ్వంసాలకు పాల్పడుతుందని, ఒక వైపు కాశ్మీర్ ప్రజలను ఉసిగోల్పడంతో పాటు కశ్మీర్లోకి ఉగ్రవాదుల అక్రమ చోరబాట్లకు మద్దనిస్తుందన్న కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్ ల వ్యాఖ్యలు ముమ్మాటికీ నిజమని తేలాయి. పాకిస్తాన్ లో కాశ్మీర్ ఎప్పుడు కలుస్తుందా అని సాక్షాత్తు అ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించడంతో చోరబాట్లకు, కాశ్మీర్ లోని విధ్వంసాలకు పాకిస్తాన్ కారణమని స్పష్టమవుతుంది. ప్రభుత్వంతో పాటు పాకిస్థాన్ అర్మీ కలిసే అక్రమ చోరబాట్లకు తేరలేపుతున్నాయన్నది వెల్లడైంది.
ఇదిలా వుండగానే తాజాగా కుప్వారా జిల్లా నౌగామ్ జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య జరిగిన హోరాహోరీ ఎన్కౌంటర్లో సజీవంగా పట్టుబడిన ఉగ్రవాది కూడా పాకిస్తాన్ కు చెందిన వాడు కావడం పాకిస్తాన్ కుట్రలను మరోమారు బాహ్య ప్రపంచానికి తెలియజేసింది. భారత దేశమే తమ దేశంలోని విధ్యంసాలకు కారణమని పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు కేవలం కపట పూరితమైనవని తేలింది. భారత్ ను ఇరుకున పెట్టి ప్రపంచ దేశాలలో తాము సచ్ఛీలులమని రుజువు చేసుకునే ప్రయత్నమేనని బయటపడింది.
కుప్వారా జిల్లా నౌగామ్ సెక్టార్ట్ లో భారత భద్రతా దళాలకు సజీవంగా పట్టుబడిన లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది పాక్ జాతీయుడుగా గుర్తించారు. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతం కాగా, పట్టుబడిన ఉగ్రవాదిని పాకిస్థాన్లోని లాహోర్ సిటీకి చెందిన బహదూర్ అలీగా గుర్తించినట్టు హోం మంత్రిత్వ శాఖ వర్గాలు బుధవారంనాడు వెల్లడించాయి. ఈ విషయాన్ని హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ అహిర్ ధ్రువీకరించారు. 22 ఏళ్ల వయసున్న బహదూర్ అలి అలియాస్ సైఫుల్లా గెరిల్లా యుద్ధతంత్రంలో లష్కరే తోయిబా వద్ద శిక్షణ పొందాడు.
అతని వద్ద నుంచి మూడు ఏకే-47 రైఫిళ్లు, రెండు పిస్తోళ్లు, రూ.23,000 భారత కరెన్సీని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. గత రెండు నెలల్లో పాకిస్థాన్ ఉగ్రవాదులను కుప్వారా జిల్లాలో సజీవంగా ప్టటుకోవడం ఇది రెండోసారి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని తీథ్వాల్ ప్రాంత నుంచి కాశ్మీర్ లోయలోకి ఒకరోజు క్రితమే ఉగ్రవాదులు ప్రవేశించినట్టు హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. తాంగ్డ్హార్ సెక్టార్లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు అక్కడి నుంచి లీపా వ్యాలీలోకి అడుగుపెట్టి, ఆ తర్వాత అటవీ ప్రాంతంలోకి చొరబడ్డారని, అక్కడే ఎన్కౌంటర్ జరిగిందని ఆ వర్గాలు తెలిపాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more