దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పాలనపరంగానే కాదు, పాపులారిటీలోనూ ఆయా విదేశాల్లోనూ తోపే. సోషల్ మీడియాను ఈయన వాడుకున్నంత మరేయితర ప్రధాని వాడుకోడంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు ప్రపంచాధినేతలు కూడా ట్విట్టర్లో, ఫేస్ బుక్ లో ఆయనను ఫాలో అయ్యేవారే. ఆయనకు సంబంధించిన వారకు ఏ న్యూస్ అయినా సెన్సేషనే. అలాంటిది మోదీ గురించి అద్వానీ చేసిన ఓ ట్వీట్ తో లక్షల మంది పూల్స్ అయ్యారు.
అద్వానీ అంటే బీజేపీ సీనియర్ నేత కాదు. ప్రముఖ బిలియర్డ్స్ ఛాంపియన్ పంకజ్ అద్వానీ. ప్రముఖ సంస్థ యూనెస్కో ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రధానిగా మోదీని ఎంపిక చేసిందంటూ ఓ పుకారు రేగింది. అయితే అది తప్పుడు వార్త అని తెలియని అద్వానీ దాన్ని మరింత వైరల్ చేసి తనతోపాటు లక్షల మందిని బకరాలను చేశాడు. అసలు పోస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు గానీ, కంగ్రాట్స్ అంటూ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. ఇక ఆయన సెలబ్రిటీ కావటం, పైగా ఆయన ఖాతాలో రెండు లక్షల మంది ఫాలోవర్లు ఉండటంతో ఆ ట్వీట్ క్షణాల్లో పాకిపోయింది.
అంతేకాదు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, వాట్స్ యాప్ ఇలా అన్నింట్లోకి పాకిపోయింది. మోదీ కంగ్రాట్స్ అంటూ ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వెలువెత్తాయి. అయితే అదంతా బుస్... అంటూ అసలు విషయాన్ని నిదానంగా చెప్పింది యూనెస్కో. ఎక్కడో వాట్సాప్ లో పుట్టిన ఈ ఫేక్ అంతా తిరిగి అద్వానీ ఖాతాకి చేరితే. ఆయన దాన్ని వైరల్ చేశారన్నమాట. ఇక విషయం తెలిసిన ప్రముఖ రచయిత చేతన్ భగత్ అద్వానీని చెడుగుడు అడుకున్నాడు. దీంతో తన తప్పును క్షమించమంటూ పంకజ్ అద్వానీ మరో పోస్ట్ పెట్టడంతో నెటిజన్లు శాంతించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more