హైదరాబాద్కు చెందిన ఓ ‘కాల్గర్ల్’ బెంగళూరులో తమిళనాడుకు చెందిన మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త, డీఎంకే పార్టీకి చెందిన రాజకీయ నాయకుడిని బురిడీ కొట్టించింది. స్వర్గసుఖాలను చూపిస్తానని చెప్పి అతన్ని నిలువుదోపిడీ చేసింది. బాధితుడి స్నేహితుడి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఇప్పుడా కాల్ గర్ల్ అన్వేషణ కొనసాగిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం సదరు నాయకుడితో పాటు అతని స్నేహితుడు కూడా పోలీసులకు అందుబాటులో లేక పోవడం గమనార్హం.
వివరాలు...తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడొకరు వ్యాపార సంబంధ పనుల పై ఈనెల 25న బెంగళూరుకు వచ్చారు. చామరాజనగర్కు చెందిన రిత్విక్ శెట్టి సదరు నాయకుడికి బెంగళూరు ఓల్డ్ ఎయిర్పోర్ట్రోడ్లో ఉన్న ఓ ఫైవ్స్టార్ హోటల్లో రాజా పేరుతో రూమ్ బుక్ చేశారు. హైదరాబాద్కు చెందిన ఓ కాస్ట్లీ కాల్గర్ల్ను కూడా విమానంలో రప్పించి ఆయన చెంతకు చేర్చారు. సదరు కాల్గర్ల్ తన దగ్గరకు వెచ్చిన వెంటనే ‘తమిళనాడు నాయకుడు’ హోటల్లోని తన రూంకు తీసుకువెళ్లారు.
మద్యం సేవించడానికి సదరు నాయకుడు తీసుకురావడానికి సదరు నాయకుడు తన హోటల్ రూమ్ నుంచి మరో ఇద్దరు స్నేహితులతో కలసి వచ్చాడు, అదే అదనుగా భావించిన మాయలేడి తన తల్లికి అరోగ్యం బాగోలేదని, దీంతో అమె అర్జెంటుగా వెళ్తున్నానని చెప్పింది, వారు అమె పరిస్థితిని అర్థం చేసుకుని వెళ్లనిచ్చారు, ఆ తరువాత కొద్ది సేవటి వరకు మద్యం సేమించిన వారు రూమ్కు వెళితే అక్కడ టేబుల్ పై ఉంచిన బంగారు గొలుసు, ఆరు లక్షల నగదు, ఐపాడ్ కనిపించలేదు. పరిస్థితిని తన స్నేహితుడైన రిత్విక్శెట్టికి ఫోన్లో చెప్పి స్వస్థలానికి వెళ్లిపోయారు. దీంతో రిత్విక్శెట్టి స్థానిక జీవన్ బీమా నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రిత్విక్ ఫోన్లో ఉన్న నంబర్లను అనుసరించి సదరు కాల్గర్ల్ హైదరాబాద్కు చెందిన యువతిగా గుర్తించారు.
ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో చెలామణి అవుతున్న ఈ 32 ఏళ్ల యువతి తన పేరును సమ్రీన్ తబస్సుమ్ గా చెప్పింది. ఈ యువతి పై ఇప్పటికే ఇలాంటి మూడు కేసులు హైదరాబాద్లోని వివిధ పోలీస్స్టేషన్లలో నమోదైనట్లు తెలుసుకున్నారు. అంతేకాకుండా హోటల్లోని వీడియో ఫుటేజీలను అనుసరించి సదరు యువతి బెంగళూరులో సదరు నాయకుడితోపాటు అతని రూమ్లోకి వెళ్లినట్లు నిర్థారణకు వచ్చారు. మరింత సమాచారం కోసం రిత్విక్కు, సదరు నాయకుడికి ఫోన్ చేస్తుంటే స్విచ్ఆఫ్ అని సమాధానం వస్తున్నట్లు కేసు దర్యాప్తు చేస్తున్న అధికారి ఒకరు తెలిపారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more