వాతావరణ మార్పులపై పారిస్ లో కీలకమైన సదస్సు నేడు ప్రారంభం కానుంది. డిసెంబర్ 11 వరకు జరగనున్న ఈ కాప్ 21 భేటీకి దాదాపు ప్రపంచ దేశాల ప్రతినిధులంతా హాజరవుతున్నారు. భారత ప్రధాని మోడీ కూడా పారిస్ చేరుకున్నారు. కాలుష్యం కోరలు చాస్తోంది..పర్యావరణం అస్తవ్యస్థమవుతోంది. అభివృద్ధి పేరిట మానవాళి సాగిస్తున్న అడ్డగోలు విధ్వంసం కారణంగా భూతాపం పెరుగుతోంది. ఇప్పుడిది జీవన్మరణ సమస్యగానూ మారింది. అస్తిత్వానికే పెనుముప్పుగా పరిణమించింది. ఇలాంటి సమయంలో పారిస్ వేదికగా జరుగుతున్న కాప్ -21 సదస్సు ప్రాధాన్యం సంతరించుకుంది.
పారిస్ లో నేడు ప్రారంభం కానున్న వాతావరణ మార్పుల సదస్సు పలు కీలక అంశాలను చర్చించనుంది. దాదాపు ప్రపంచ దేశాలన్నీ హాజరవుతున్న ఆ సదస్సు భవిష్యత్ పై భరోసాను ఇచ్చే దిశగా నిర్ణయాలు తీసుకోనుంది. 2015 నాటికి కర్బన ఉద్గారాల విడుదలను నియంత్రించే ఒప్పందాన్ని సాధించాలని ఐక్య రాజ్య సమితి లక్ష్యంగా పెట్టుకుంది. పారిస్ లో జరుగుతున్న 21వ వార్షిక సదస్సులోనైనా ప్రపంచ దేశాలన్నీ చట్టపరంగా కట్టుబడి ఉండాల్సిన ఉద్గారాల కోతలకు అంగీకరిస్తాయని అంతా ఆశిస్తున్నారు. పారిస్ సదస్సులో పాల్గొనేందుకు అన్ని దేశాల అధినేతలు తరలివచ్చారు. అమెరికా ప్రెసిడెంట్ ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర దేశాల ప్రతినిధులు ఇప్పటికే పారిస్ చేరారు. పుడమి తల్లి భవిత కోసం...భవిష్యత్ తరాల బాగు కోసం పారిస్ కాప్-21 సదస్సు మార్గ నిర్దేశనం చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అడుగులు పడాలని అందరూ ఎదురు చూస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more