ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖలో ఏడు వేల ఖాళీలకు సంబందించిన ఫైల్ ను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించారు. ఈ పోస్టులలో ఎస్సై, డ్రైవర్లు, కానిస్టేబుళ్ళు, కుక్లు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసు శాఖపై పనిభారం పెరిగిన నేపథ్యంలో ఖాళీలు భర్తీ చేయడంతో పాటు మరిన్ని కొత్త పోస్టులు మంజూరు చేయాలంటూ రాష్ట్ర పోలీసు శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు స్పందించిన ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టులను వీలైనంత తొందరగా భర్తీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. దీంతో అధికారులు ఖాళీల వివరాలను తెలియజేస్తూ సీఎం కార్యాలయానికి ఫైలును పంపించారు.
శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ ఫైల్ మీద సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోనున్నారని, వెనువెంటనే నియామకాల ప్రక్రియను ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. సిబ్బందిపై పనిభారం తగ్గించాల్సిన అవసరం ఉందని, లేకపోతే దుష్పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని ఇటీవల డీజీపీ జేవీ రాముడు నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో పేర్కొన్న నేపథ్యంలో ముందుగా ఖాళీల భర్తీకి ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలని భావించారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం హోంమంత్రి చినరాజప్పకు ఖాళీల నివేదికను పంపించగా, ఆయన సీఎం కార్యాలయానికి పంపించారు. పోలీసులకు సహాయకులుగా పని చేసే హోంగార్డుల నియామకంపై ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖాళీలను భర్తీ చేస్తూనే కొత్త పోస్టుల కోసం ప్రభుత్వం ముందు ప్రతిపాదనలను పెట్టాలని అధికారులు భావిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more