‘ముంబై 26/11’ దాడులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే! ఆ తర్వాత అటువంటి దాడులు జరగకుండా భారత ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చింది. అయితే.. పంజాబ్ లో అనుకోకుండా కొందరు ఉగ్రవాదులు ముంబై తరహా దాడికి తెగబడ్డారు. ఆర్మీ దుస్తులు ధరించిన నలుగురు దుండగులు పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్ పూర్ జిల్లాలో వున్న దీవానగర్ పోలీస్ స్టేషన్ పై కాల్పులు జరిపారు. ఈరోజు (సోమవారం) ఉదయం నుంచి కొనసాగుతున్న ఈ కాల్పుల్లో ఇప్పటికే ఇద్దరు పోలీసులు మరణించగా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రస్తుతం అందుతున్న సమాచారాల ప్రకారం.. ఆ నలుగురు దుండగులు వేరొక ప్రాంతంలో ఓ తెలుపురంగు మారుతీ కారును దొంగలించి.. దీవానగర్ కు చేరారు. తొలుత అటుగా వెళుతున్న ఓ బస్సుపై కాల్పులకు తెగబడ్డ వారు.. ఆ తర్వాత ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ లోకి చొచ్చుకొనివెళ్లారు. తమ చేతుల్లో వున్న తుపాకులతో ఒక్కసారిగా పెట్రేగిపోయారు. అక్కడున్న గార్డులను చంపి స్టేషన్ ను తమ అధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే.. ఈ హఠాత్పరిణామంతో తేరుకున్న పోలీసులు కూడా ఆ ఉగ్రవాదులపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ దాడుల్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ తోపాటు మరో పౌరుడు చనిపోయాడు. ఏడుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దుండగులు, పోలీసుల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతూనే వున్నాయి. దీంతో అక్కడి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
మరోవైపు.. దీవానగర్-పఠాన్ కోట్ మధ్య వున్న రైల్వే ట్రాక్ పై పోలీసులు ఐదు బాంబులను గుర్తించారు. దీంతో హైలర్ట్ ప్రకటించిన ఉన్నతాధికారులు నేరుగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ సంఘటన చోటుచేసుకున్న దీవానగర్.. పాకిస్తాన్ సరిహద్దుకు అతి సమీపంలో వుంది. ఆ ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ కీలక స్థావరాలు వున్నాయి. దీంతో ఈ దాడికి పాల్పడింది ఉగ్రవాదులేనని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఉగ్రవాదుల్లో ఓ మహిళ కూడా వుంది. ఈ దాడులకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more