ఆచార్య నాగార్జున యూనివర్శిటీని పదిరోజుల పాటు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య ఘటనతో గత మూడు రోజులుగా యూనివర్సిటిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం.. అక్కడ పరిస్థితులు సజావుగా సాగటానికి కొద్ది రోజులు సెలవులు ఇవ్వాలని ఆదేశించటంతో విశ్వవిద్యాలయం పది రోజులు సెలవులు ప్రకటించింది. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు విశ్వవిద్యాలయంలో ఉన్న అన్ని కుల సంఘాల బోర్డులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. వసతి గృహాల్లో ఉన్న బయట వ్యక్తులను తక్షణమే పంపించేయాలని నిర్ణయం తీసుకున్నారు.
Also Read: వర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య వెనుక రియల్ మిస్టరీ ఇదే!
సీనియర్ల ఆగడాలకు బలైపోయిన రిషికేశ్వరి ఘటనపై యూనివర్సిటిలో ఆగ్రహ జ్వాలలు రేగాయి. సీనియర్ విద్యార్థులు ఎంతగా ర్యాగింగ్ చేస్తున్నా కూడా యూనివర్సిటి విసి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని... ప్రిన్సిపాల్ కూడా ఏమీ చెయ్యలేకపోతున్నారని మండిపడుతున్నారు. అయితే దీని మీద సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైంది. రిషికేశ్వరీ తన మీద, తనలాంటి జూనియర్ల మీద జరుగుతున్న ర్యాగింగ్ భూతానికి బలైన విధానం మీద లెటర్ లో వివరించింది. దేశవ్యాప్తంగా ర్యాంగింగ్ మీద నిషేదం ఉన్నా కానీ నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ కొనసాగడం మీద విమర్శలు వస్తున్నాయి. నాగారర్జున వర్సిటీలో రిషికేశ్వరీ ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేగింది.
Also Read: నాగార్జునా యూనివర్శిటీలో ఉద్రిక్తత.. తూతూ మంత్రంగా ముగిసిన నిజనిర్థారణ కమిటీ
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ జిల్లా విద్యార్థిని రుషికేశ్వరి మృతి కేసును గుంటూరు జిల్లా లీగల్సెల్ అథారిటీ శుక్రవారం సుమోటోగా స్వీకరించింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆమె ర్యాగింగ్ వల్లే చనిపోలేదని, సహ విద్యార్థుల లైంగిక వేధింపులు కూడా కారణమని భావిస్తున్నారు. ఆర్కెటెక్ కళాశాల ప్రిన్సిపాల్ మద్యం సేవించి విద్యార్థులతో కలిసి చిందులేసిన దృశ్యాలు లీగల్సెల్ అథారిటీకి చేరాయి. వీటి ఆధారంగా ఈ కేసును సుమోటోగా జిల్లా లీగల్సెల్ అథారిటీ స్వీకరించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్ బాబూరావు, వార్డెన్ స్వరూపరాణికి నోటీసులు జారీ చేసింది.
By Abhinavachary
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more