తెలుగు రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విడగొట్టిన పాపానికి ఏపిలో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా పోయాయి. ఇక అంతో కొంతో ఉన్న తెలంగాణలోనూ పార్టీకి పంగనామాలు పెడుతూ పెద్ద నాయకులు మొ్తం చెయ్యిచ్చి కారెక్కుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని ఖాళీ చేసే పనిలో పడింది టిఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే చాలా మందిని పార్టీలొకి చేర్చుకున్న గులాబీ దళం తాజాగా మిగిలిన పెద్ద తలకాయల మీద దృష్టి సారించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చెయ్యడం వల్ల తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తుందని ఊహించి తీసుకున్న నిర్ణయానికి కోలుకోలేని దెబ్బ తీశారు తెలుగు ప్రజలు. అయితే తాజాగా డిఎస్ టిఆర్ఎస్ పార్టీలోకి చేరడంతో వలసల పర్వానికి కాంగ్రెస్ బలైపోతున్న విషయంపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. అయితే డిఎస్ తర్వాత జానారెడ్డి, తర్వాత మరికొందరు నేతలు కూడా క్యూలో ఉన్నారని ఇప్పటికే రాజకీయ చర్చసాగుతోంది.
మెదక్ జిల్లాలో మరో కీలక బీసీ నేత నందీశ్వర్గౌడ్ కూడా టీఆర్ఎస్లో చేరుతారన్న వార్తలున్నాయి. నిజామాబాద్ జిల్లాకే చెందిన మాజీ మంత్రి పి.సుదర్శన్రెడ్డి కూడా డీఎస్తోపాటు టీఆర్ఎస్ తీర్థంపుచ్చుకోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక మాజీ ఎంపీ, మహబూబ్నగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత విఠల్రావు సీఎంను కలిశారు. జిల్లా సమస్యలపై కలిసినట్లు చెబుతున్నప్పటికీ... ఈయన కూడా టీఆర్ఎస్లో చేరడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తే... తనకు టీఆర్ఎస్ నుంచి టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. కానీ సీఎం నుంచి ఎలాంటి భరోసా లభించలేదని తెలుస్తోంది. ఇక మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కూడా ఇటీవల పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈయన కాంగ్రెస్ను వీడి టీడీపీలో చేరుతారన్న వార్తలు పార్టీలో వినిపిస్తున్నాయి. కానీ తాను పార్టీ మారేది లేదని ముఖేశ్ స్పష్టం చేయడం విశేషం. ఇలా సీనియర్ నేతలంతా పార్టీని వీడడానికి సిద్ధమవుతుండడం.. మిగిలినవారిలో ఆందోళన కలిగిస్తోంది. మరి కాంగ్రెస్ అధినాయకత్వం వలసలకు ఎలా అడ్డుకట్ట వేస్తుందో చూడాలి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more