పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖమ్మం జిల్లాలో బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న చిన్నారి శ్రీజను పరామర్శించడంతో ప్రారంభమైన మేక్ ఏ విష్ జోరు.. అభం శుభం తెలియని, కల్మషాలు ఎరుగని చిన్నారుల ముఖంలో చిరునవ్వులు పూయించేందుకు చేస్తున్న కృషి అభినందనీయం. ఈ నేపథ్యంలో మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యులు చిరంజీవి, ఆయన తనయుడు మొగా పవర్ స్టార్ రాంచరణ్, నందమూరి నటవారసుడు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, ప్రిన్స్ మహేష్ బాబుల తరువాత స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కూడా దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులను కలిశారు.
నగరంలోని లక్డీకాపూల్లోని మేక్ ఏ విష్ ఫౌండేషన్లో కేన్సర్తో పాటు వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులను నటుడు అల్లు అర్జున్ బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి బహుమతులను అందజేశారు. చిన్నారులతో సరదాగా కాసేపు గడిపారు. వారి ముఖాలతో స్వచ్ఛమైన చిరునవ్వులతో ఆయన పొంగిపోయారు. వారికి తెలియకుండానే వారు ఈ వ్యాధిగ్రస్తులుగా మారుతున్నారని మేక్ ఏ విష్ సంస్థ నిర్వాహకులు చెప్పడంతో ఆయన కల్లు చమ్మగిల్లాయి.
ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ ముగ్గురు పిల్లలు కేన్సర్తో బాధపడుతున్నారని, వారి కండిషన్ సీరియస్గా ఉందని అన్నారు. ఈ ఆర్గనైజేషన్ తరఫున పిలుపు వస్తే ఏ సెలబ్రెటి అయినా వెంటనే స్పందిచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పిల్లలను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని, చఅన్నీ మనం డబ్బుతో కొనలేమని ఆయన అన్నారు. చిన్నారులు చూపించే నిష్కలంక ప్రేమను ఎంత డబ్బు పెట్టినా లభించదన్నారు. మేక్ ఏ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన బై సైకిల్స్ను కొందరికి అల్లు అర్జున్ చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా మేక్ ఏ విష్ ఫౌండేషన్ స్ఫూర్తిని ఆయన అభినందించారు. కేన్సర్తో పాటు వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్నవారు తమ అభిమాన హీరో అల్లు అర్జున్ను చూడాలని బాలలు కోరడంతో స్పందించిన మేకే విష్ పౌండేషన్ బాలల కోరిక తీర్చేందుకు ముందుకు వచ్చి హీరో అల్లు అర్జున్తో మాట్లాడి పిల్లల కోరిక తీర్చింది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more