విమాన ప్రయాణికులకు శుభవార్త. విమానయాన ప్రయాణికులు తమ వెంట తీసుకువెళ్లే లగేజీపై చార్జీల మోతను పెంచరాదని ఎయిర్లైన్స్ కంపెనీలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సూచించింది. చౌకదరల విమానయాన సంస్థలు ప్రయాణికుల ధరలపై పోటీపడుతూ అత్యంత చౌకగా గమ్యస్థానాలకు చేర్చుతూనే.. ఇటు ప్రయాణికుల లగేజీపై చార్జీలను విధించాలని భావించాయి. స్పైస్జెట్, ఇండిగో, ఎయిర్ ఆసియా వంటి చవక ఎయిర్లైన్స్ కంపెనీలు చెక్ ఇన్ లగేజీపై చార్జీలు విధించాలన్న ప్రతిపాదనలు డిజిసిఎ ముందుంచాయి. అయితే ఇప్పటికే విమాన టికె ట్ చార్జీల మోతతో ఎంతో మంది విమానయానానికి దూరంగా ఉన్నారని.. ఇలాంటి నేపథ్యంలో ప్రయాణికులపై ఎలాంటి అధిక భారం మోపడం ఇష్టంలేని డిజీసీఏ అందుకు ఎర్రజెండాను ఊపింది.
ఇప్పటిదాకా ప్రయాణికులు తమ వెంట 15 కిలోల వరకు లగేజీని ఎటువంటి చార్జీలు చెల్లించకుండా తీసుకువెళ్లే వెసులుబాటు ఉంది. ఈ నేపథ్యంలో చాలా మంది లగేజీని తీసుకువెళ్లడానికి ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చెకిన్ లగేజీపై చార్జీలు వసూలు చేయాలన్న నిర్ణయానికి ఎయిర్లైన్స్ కంపెనీలు వచ్చాయి. విమాన సర్వీసులను విభజించేందుకు గత ఏప్రిల్లోనే డిజిసిఎ దేశీయ ఎయిర్లైన్స్ కంపెనీలకు అనుమతి ఇచ్చింది. దీని మూలంగా ఎంచుకున్న సీటు, ఆహారం, లాంజ్ వినియోగానికి కంపెనీలు వేర్వేరుగా చార్జీలు వసూలు చేయడం మొదలుపెట్టాయి.
చెక్ ఇన్ లగేజీ ప్రతిపాదనకు ఆమోదముద్రవేస్తే మొదటి చెక్ ఇన్ లగేజ్కి 250 రూపాయలు, రెండో బ్యాగేజీకి 500 రూపాయలు, మూడో బ్యాగేజీకి 1,500 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. మూడు కంపెనీలు ఈ ప్రతిపాదనలు చేశాయి. లగేజీపై చార్జీలను వసూలు చేసే ప్రతిపాదనతో పాటు లగేజీ లేకుండా వచ్చే వారికి డిస్కౌంట్లు ఇస్తామన్న ప్రతిపాదనను కూడా డిజిసిఎ ముందుంచాయి. దీని వల్ల తమ ప్రతిపాదనకు ఆమోదం వస్తుందన్న ఆశతో ఎదురుచూసిన విమాన సంస్థలకు నిరాశే ఎదురైంది. విమానయాన ప్రయాణికులపై అదనపు భారాన్ని ఎంతమాత్రం మోపేందుకు ఇష్టపడని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంత్రి మహేష్ శర్మ చెక్ ఇన్ లగేజీ పై చార్జీల విధానాన్ని తాము నిర్ద్వందంగా వ్యతిరేకించినట్లు చెప్పారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more