ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎందరో అమరవీరులయ్యారు. నాలుగుకోట్ల జనాలకు సొంత రాష్ట్రం కావాలని కోరుతూ తమ ప్రాణాలు విడిచారు. అటువంటి వీరులకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసలు గుర్తింపే లేకుండా పోయిందని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం కోసం అమరులైన వారి కుటుంబాలను ఆదుకుంటామన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వం.. ఇంతవరకు అలా చేయకపోవడం చాలా దారుణమని అన్నారు.
మహానాడు సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. తెలంగాణలోని నాలుగు కోట్ల మంది వివరాలను 12 గంటల్లో నమోదు చేసినట్టు ప్రకటించిన కేసీఆర్.. అధికారం చేపట్టి 12 నెలలు గడిచినా అమరవీరుల కుటుంబాలను గుర్తించి ఆదుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో కోళ్లు, పందుల లెక్కలు నమోదు చేసిన కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల లెక్కలు తేల్చకపోవడం వారి త్యాగాలను అవమానపరచడమేనని పేర్కొన్నారు.
ఇదిలావుండగా.. తెలంగాణ తొలి, మలి ఉద్యమాల్లో అసువులు బాసిన 1569 మంది అమరవీరుల కుటుంబాలకు రేవంత్ రెడ్డి సంతాపం తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టారు. 1969లో తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన తొలి ఉద్యమంలో కాంగ్రెస్ ప్రభుత్వం 369 మంది విద్యార్థులను కాల్చి చంపిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2001లో మలి ఉద్యమం మొదట్లో ‘నేను, నాకు వండిపెట్టే ముసలిది మాత్రమే ఇక్కడ ఉన్నాం, పిల్లలు అమెరికాలో ఉన్నారు’ అని చెప్పిన కేసీఆర్ను తెలంగాణ ప్రజలు అమాయకంగా నమ్మారని అన్నారు.
బంగారు భవిష్యత్తుపై ఎన్నో కలలతో యూనివర్సిటీలో అడుగుపెట్టిన శ్రీకాంతాచారి.. ఇక్కడి పరిస్థితి చూసి చలించి వంటిపై పెట్రోల్ చల్లుకుని ఆత్మబలిదానం చేసుకున్నాడని గుర్తు చేశారు. మంటల్లో కాలిపోతున్నా అమ్మా అనకుండా జై తెలంగాణ... అంటూ ప్రాణత్యాగం చేశాడని పేర్కొన్నారు. కానిస్టేబుల్ కిష్టయ్య, యాదిరెడ్డి వంటి వారెందరో బలిదానాలు చేసుకున్నారని అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను.. ఉద్యమానికి నాయకత్వం వ హించిన కేసీఆర్ను నమ్మి ఆయన చేతిలో పెట్టారని అన్నారు.
తెలంగాణ ఉద్యమకారులకు రూ.10 లక్షలు అందిస్తామని ప్రకటించి పట్టించకోలేదన్నారు. అధికారం చేపట్టి 12 నెలలైనా 1200 మందిలో ఇప్పటి వరకు కేవలం 481 మందినే గుర్తించామంటే మిగిలిన అమరవీరులను అవమానపర్చినట్టేనని రేవంత్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గన్పార్క్లో అమరవీరుల స్ధూపాన్ని నిర్మించి 40 ఏళ్లు గడిచినా అధికారికంగా ప్రారంభించలేదని అన్నారు. హుస్సేన్సాగర్ బుద్ధుడికి సమాంతరంగా తెలంగాణ అమర వీరుల స్మారక స్థూపం నిర్మించాలని డిమాండ్ చేశారు.
తెలుగుదేశం అధికారంలోకి వస్తే తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపాన్ని వెయ్యి కోట్లతో నిర్మిస్తామని రేవంత్ పేర్కొన్నారు. అలాగే గన్పార్క్లో అమరవీరుల స్థూపాన్ని అధికారికంగా ప్రారంభిస్తామని చెప్పారు. విద్యార్థుల ఉద్యమంతోనే తెలంగాణ సాకారమైందని పలుమార్లు ప్రకటించిన కేసీఆర్ ఓయూ భూములు కబ్జా చేయడానికి వచ్చి పోరగాళ్లకు అవగాహన లేదనడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. ఏపీలో డీఎస్సీ పరీక్ష పెట్టి టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారని, తెలంగాణలో ఎందుకు డీఎస్సీ పెట్టడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ను కుర్చీ నుంచి దించేందుకు టీడీపీ కార్యకర్తలు ఉద్యమించాలని, అది కేవలం టీడీపీకే సాధ్యమని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more