తారల కోసం అభిమానులు పడే పాట్లు అన్ని ఇన్నీ కావు. అయితే ఈ మధ్య టాలీవుడ్ లో అభిమానుల కోసం మన స్ఠార్ హీరోలు తరలివెళ్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మొగా స్ఠార్ చిరంజివీ, స్టైలిష్ స్టార్ అల్లుఅర్జన్ ఈ క్రమంలో ఇప్పుడు యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు చేరారు. కూకట్ పల్లి బాబా రామ్ దేవ్ రావు మెమొరియల్ ఆస్పత్రిలో బ్లడ్ కేన్సర్తో బాధపడుతున్న ఓ చిన్నారిని యువ హీరో జూనియర్ ఎన్టీఆర్ పరామర్శించాడు. శ్రీనిధి అనే చిన్నారి గత కొంతకాలంగా కేన్సర్తో బాధపడుతోంది. జూనియర్ ఎన్టీఆర్ను చూడాలని శ్రీనిధి కోరడంతో ట్టిట్వర్ ద్వారా సమాచారం అందుకున్న జానియర్ ఎన్టీయార్ శ్రీనిధిని కలిసి కొద్దిసేపు ఆమెతో గడిపాడు. అమె ఆరోగ్యం తదితర అంశాలపై ఆయన ఆరా తీశారు. శ్రీనిధి తల్లిదండ్రులతోనూ అమె ఆరోగ్య విషయమై అడిగి తెలుసుకున్న యంగ్ టైగర్.. వైద్యులతో కూడా శ్రీనిధి అరోగ్యంపై చర్చించారు.
అనంతరం ఆమన మీడియాతో మాట్లాడుతూ.. పిల్లలకు ఏమైనా జరిగితే తల్లిదండ్రులు పడే బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసునన్నాడు. పిల్లలకు ఏదైనా జరిగితే తల్లిదండ్రుల గుండె తరుక్కుపోతుంది. అటువంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని అన్నాడు.. చిన్నారి శ్రీనిధి ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పాడు. శ్రీనిధి కోలుకుని మనందరి మధ్య ఆరోగ్యంగా తిరగాలని కోరుకుంటున్నట్లు ఆశాభాశాన్ని వ్యక్తం చేశారు. అమెకు ఏదో చేయాలని ఉంది. తప్పకుండా సాయం చేస్తానన్నాడు. శ్రీనిధి పరిస్థితి చూసిన తరువాత అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. తాను రావడం వల్ల అయినా ఆ పాపకు ఆరోగ్యం ఎంతో కొంత మెరుగుపడితే బాగుంటుంది. అందరి ప్రార్థనలు ఫలించి శ్రీనిధి త్వరగా కోలుకోవాలని అభిలాశించాడు. పాప కోలుకుంటే అంతకన్నా కావల్సింది ఏమీ లేదు. పాప కోర్కెను తీర్చాలనే ఇక్కడకు వచ్చాను' అని తెలిపాడు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more