వందల కోట్ల రూపాయల సొమ్ములను కస్టమర్ల దగ్గరి నుండి వసూలు చేసి, ప్రస్తుతం పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న సంస్థ అగ్రిగోల్డ్ సంస్థ. గత కొంత కాలంగా ఖాతాదారులకు డబ్బులు చెల్లించడంలో జాప్యం చేస్తూ వచ్చిన ఈ సంస్థ ప్రస్తుతం సీబిఐ విచారణ సాగుతుండటంతో ఖాతాదారుల్లో ఆందోళన మొదలైంది. నిన్నటి దాకా నెల్లూరు, గుంటూరు ప్రాంతాలకు పరిమితమైన ఆందోళనలు ప్రస్తుతం హైదరాబాద్ కూ విస్తరించాయి. హైదరాబాద్ పంజాగుట్టలోని అగ్రిగోల్డ్ కార్యాలయం వద్ద డిపాజిట్దారులు, ఏజెంట్లు ఆందోళనకు దిగారు. తమ డిపాజిట్ చేసిన సొమ్ము వెనక్కి ఇవ్వాలంటూ బాధితులు డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకూ పోరాటాన్ని ఆపేది లేదని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
ఇటీవల ఖాతాదారులకు చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యం, సంస్థ విజయవాడ కార్యాలయంలో సీబీఐ సోదాలు వంటివి అగ్రిగోల్డ్ సంస్థ ఖాతాదారులకు ఆందోళనకు కలిగించాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక,ఒడిశాలో ఉన్న ఖాతాదారులు పెద్దసంఖ్యలో ఎక్కడికక్కడ ఆందోళనకు దిగుతున్న విషయం తెలిసిందే. అగ్రిగోల్డ్ సంస్థలో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన ఖాతాదారులకు కాలపరి మితి ముగిసిన తర్వాత సొమ్ము చెల్లింపులో కొన్ని నెలులుగా తీవ్ర జాప్యం జరుగుతోంది. గట్టిగా అడిగిన వారికి చెక్కులిచ్చి పంపిస్తున్నారు. వాటిని బ్యాం కులో వేస్తే సంస్థ ఖాతాలో సొమ్ము లేక తిరిగి వచ్చేస్తున్నాయి. తమను మోసం చేసి బోర్డు తిరగేసేందుకు సంస్థ ప్రయత్నిస్తోందని పలువురు ఆరోపించారు. ఇప్పటికే ఏపి ప్రభుత్వం అగ్రిగోల్డ్ పై పూర్తి స్థాయి సిబిఐ విచారణకు ఆదేశించింది. గత వారం కిందటే అగ్రిగోల్డ్ సంస్థ ఓ పత్రిక ప్రకటనను విడుదల చేసింది. సంస్థ కార్యక్రమాలకు ఆటకం కలిగిన మాట వాస్తవమే అని, కానీ సంస్థ పూర్తి నమ్మకంగా పని చేస్తుందని ప్రకటనలో అగ్రిగోల్డ్ పేర్కొంది. ఏజెంట్లను ఇబ్బందులు పెట్టవద్దని కూడా అందులో పేర్కొంది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more