అనుకున్నంతా అయ్యింది.. తెలంగాణ నుండి వచ్చే వాహనాలపై పన్ను వెయ్యాలని ఏపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చెయ్యడం.. అర్దరాత్రి నుండి అమలు టకటకా జరిగిపోయాయి. తాజా ఉత్తర్వులకు అనుగుణంగా చెక్ పోస్టుల వద్ద తెలంగాణ వాహనాల నుంచి ప్రవేశ పన్ను వసూలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ముందుగా తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి ఎంట్రీ ట్యాక్స్ విధానాన్ని అమలు చేసింది. తెలంగాణలో ప్రవేశించే ఏపీ వాహనాలపై పన్ను విధించింది. ఈ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం కావడం, ఉపసంహరణకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించక పోవడంతో.. అప్పట్లోనే ఏపీ ప్రభుత్వం కూడా ప్రవేశ పన్నును అమలు చేద్దామని భావించింది. రవాణా శాఖ అధికారులకు.. ఆ మేరకు లెక్కలు తీయాలని, ఏ మేరకు ఆదాయం లభిస్తుందో పరిశీలించాలని ఆదేశాలిచ్చింది. తెలంగాణ కంటే ఏపీకి తక్కువ ఆదాయం వస్తుందని తేలడంతో వెనక్కు తగ్గింది. పన్ను ఉపసంహరణపై తెలంగాణ ప్రభుత్వానికి లేఖలు, చర్చలు అంటూ హడావుడి చేసినా ఫలితం లేకపోవడంతో రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు కేంద్ర రవాణా మంత్రి గడ్కారీకి ఫిర్యాదు చేశారు. ఇందులో తాము జోక్యం చేసుకోబోమని గడ్కారీతో పాటు మరో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్లు స్పష్టం చేశారు. మరోవైపు ఏపీ ప్రైవేట్ బస్ ఆపరేటర్ల సంఘం, లారీ యజమానుల అసోసియేషన్లు కోర్టులను ఆశ్రయించాయి. సుప్రీంకోర్టు కనీసం పిటిషన్ను స్వీకరించడానికి కూడా నిరాకరించింది.
ఈ నేపథ్యంలోనే.. తెలంగాణకు చెందిన వాణిజ్య వాహనాలు, లారీలు, స్టేజి క్యారియర్లుగా తిరిగే బస్సులు రాష్ట్రంలో ప్రవేశిస్తే పన్ను విధించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సింగపూర్ పర్యటన కారణంగా నిర్ణయం అమలు కొంతకాలం వాయిదా పడినా.. శుక్రవారం ఆ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. తెలంగాణ ప్రాంతం నుంచి కృష్ణపట్నం, కాకినాడ పోర్టులకు గ్రానైట్ లారీలు తిరుగుతుండటం, తిరుమల, శ్రీశైలం క్షేత్రాలకు ఆ రాష్ట్రం నుంచి భక్తుల రాకపోకలు ఎక్కువగా ఉన్నందున.. ఎంట్రీ ట్యాక్స్ ద్వారా నెలకు నాలుగైదు కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ఏపి ప్రభుత్వం వినతిని స్వీకరించకుండా కేవలం రాష్ట్రానికి ఆదాయం వస్తుందని.. ఏపి నుండి వచ్చే వాహనాలపై పన్ను బాదుడుకు సిద్దమైంది. దాంతో ఏపి కూడా ఖజానాను నింపుకునేందుకు, తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇవ్వడానికి అన్నట్లు కొత్తగా తెలంగాణ వాహనాలపై పన్నును ప్రవేశపెట్టింది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more