బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో ఈ నెల 20న ముంబై న్యాయస్థానం తుది తీర్పును వెలువరించనుంది. సర్వోన్నత న్యాయస్థానం అదేశం మేరకు మరోమారు సల్మాన్ ఖాన్ సహా అతని తరపున కేసులో ప్రత్యక్షంగా ప్రమేయమున్న వారందరి వాంగ్మూళాలను విన్న న్యాయస్థానం.. సోమవారం తుది తీర్పును వెలువరించనుంది. 2002 సెప్టెంబర్ 28న బాంద్రాలో నిద్రిస్తున్న ఐదుగురిపై నుంచి సల్మాన్ ప్రయాణిస్తున్న కారు వెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా... మరో నలుగురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దాదాపు 13 ఏళ్లగా ఈ కేసు కోర్టులో విచారణ జరగుతుంది. 27 మంది సాక్షులను కోర్టు ఈ సందర్భంగా విచారించింది.
నిన్నసల్మాన్ ఖాన్ న్యాయవాది శ్రీకాంత్ శివాదే వాదనలను కూడా న్యాయస్తానం విన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తీర్పు స్మలాన్ ఖాన్ కు సానుకూలంగా వుండే అవకాశాలే అధికంగా వున్నాయని చెప్పారు. ప్రమాదం జరిగిన రోజున తన లాండ్ క్రూసెర్ కారులో హిల్ రోడ్డు నుంచి వస్తున్న సల్మాన్ ఖాన్ కారు టైరు పేలడంతో కారు పేవ్ మెంట్ మీదకు వెళ్లడంతోనే ఘటన జరిగిందని ఆయన చెప్పారు. ఇందుకు బిన్నంగా ఒక్క సాక్ష్యాన్ని కూడా ఇప్పటి వరకు ప్రాసిక్యూషన్ తరుపు న్యాయవాదులు ప్రవేశపెట్టలేదని చెప్పారు. దీనికి తోడు సల్మాన్ ఖాన్ కారు డ్రైవర్ అశోక్ సింగ్.. తానే ఈ కారు నడిపానని, ప్రమాద సమయంలోనూ కారును తానే తోలుతున్నానని కోర్టుకు తెలిపాడని చెప్పారు. వీటి ఆధారంగా తీర్పు సల్మాన్ ఖాన్ కు సానుకూలంగా వుంటుందని ఆయన అశాభావం వ్యక్తం చేశారు. అయితే హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ కు వ్యతిరేకంగా కోర్టు తీర్పును వెలువరించిన పక్షంలో ఆయనకు పదేళ్ల కాలం పాటు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయని న్యాయనిపుణులు అంటున్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more