ఐపీఎల్.. బయటి ప్రపంచానికి ఓ ఉత్సాహకరమైన క్రీడ! కానీ.. లోపల మాత్రం ఫిక్సింగ్ మాఫియా! ఎన్ని జాగ్రత్తలు పాటించినప్పటికీ ఐపీఎల్ లో ఫిక్సింగ్ ఎలాగోలా జరుగుతూనే వుంది. ఐపీఎల్ -6 సీజన్ లో భాగంగా ఈ ఫిక్సింగ్ బంఢారం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే! ఆ తర్వాత 7వ సీజన్ లోనూ ఫిక్సింగ్ జరిగిందనే వార్తలొచ్చాయి. ఇప్పుడు ఈసారి జరుగుతున్న 8వ సీజన్ లో కూడా ఈ ఫిక్సింగ్ మాఫియా లోలోపలే కొనసాగుతోందన్న అనుమానాలు వచ్చిన నేపథ్యంలో.. దానిని పారద్రోలేందుకు బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం కొన్ని కీలకమైన ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా క్రికెటర్లకు స్పెషల్ క్లాసులు తీసుకుంటోందని సమాచారం!
క్రికెటర్లను వశపరచుకొని మ్యాచ్ లను ఫిక్సింగ్ చేయాలని చూసే బుకీలె ఎలాంటి ఎత్తులు వేస్తారోనని తెలుపడంతోపాటు అందులో ఇరుక్కోవద్దని ఆ నిరోధక విభాగం ఐపీఎల్ లోని అన్ని ఫ్రాంఛైజీల ఆటగాళ్లకు వివరించింది. పైగా.. ఫిక్సింగ్ మాఫియా ఎలా పనిచేస్తుందోన్నన్న విషయంపై వారికి వివరణ ఇచ్చింది. క్రికెటర్లను ఆకర్షించేందుకు బుకీలు మొదట అందమైన అమ్మాయిలను ఎంపిక చేసి.. వారిని అభిమానుల రూపంలో క్రికెటర్ల దగ్గరకు పంపిస్తారని వివరించింది. అనంతరం అమ్మాయిలు ఎంచుకున్న క్రికెటర్లను బుకీలు పరిచయం చేసుకుంటారని, వారిద్దరి పరిచయాన్ని దగ్గరి సంబంధంగా మార్చేందుకు ప్రయత్నిస్తారని తెలిపింది.
వారిద్దరి మధ్య బంధం బలపడిందని భావించిన బుకీలు ఆ తర్వాత రంగంలోకి దిగి... సదరు క్రికెటర్లు అమ్మాయితో సన్నిహితంగా వున్న వీడియోలను చిత్రీకరించి వారికి లోబరుకునేందుకు ప్రయత్నిస్తారని వివరించింది. అటువంటి ఆందోళనకరమైన పరిస్థితిలో క్రికెటర్లు పై అధికారులకైన ఫిర్యాదు చేయాల్సి వస్తుంది లేదా బుకీలతో చేతులు కలపాల్సి వస్తుంది. ఆ కీలకమైన సమయాన్ని సదరు ఆటగాడు తేల్చుకోవాల్సి వుంటుందని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం తెలిపింది. ఒకసారి బుకీలు, ఫిక్సర్ల వలలో పడితే మాత్రం వెనక్కు రావడం అంత సులభం కాదని తేల్చి చెప్పింది. మరి.. ఈ పాఠాలతో క్రికెటర్లు ఎంతమేర అవగాహన పొందుతారో వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more