ఇప్పటివరకు భర్తల చేతుల్లో భార్యలు బాధితులుగా మారిన సంఘటనలు ఎన్నో చూశాం కానీ.. తొలిసారి అందుకు విరుద్ధంగా భర్తలు ‘దయచేసి మా భార్యల నుంచి మమ్మల్ని కాపాడండోయ్’ అంటూ మొరపెట్టుకుంటున్నారు. ‘మా భార్యలు పెట్టే టార్చర్ భరించలేకపోతున్నాం.. దయచేసి మమ్మల్ని కాపాడండి’ అంటూ గుజరాత్లో మహిళల రక్షణ కోసం ఏర్పాటుచేసిన హెల్ప్ లైన్ను కొందరు భర్తలు ఆశ్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు.
మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలను అరికట్టేందుకు గుజరాత్ ప్రభుత్వం ‘పోలీసులు అభయం’ అనే హెల్ప్ లైన్ ప్రారంభించింది. అందుకోసం ప్రత్యేకంగా 181 అనే టోల్ ఫ్రీ నంబర్ కేటాయించారు. మొదట్లో ఈ నెంబరుకు మహిళలు ఫోన్ చేసి తమ ఆవేదన వ్యక్తం చేసేవారు కానీ.. ఇటీవలే కాలంలో ఆ నెంబర్కు మహిళల కన్నా పురుషులే ఎక్కువగా ఫోన్లు చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. తమ భార్యలు మరీ దారుణంగా తమను హింసిస్తున్నారంటూ భర్తలు వరుసగా ఫోన్లు చేస్తున్నారని వారు పేర్కొంటున్నారు.
ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోకుండా తమ భార్యలు ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తిస్తూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, గృహహింసకు కూడా పాల్పడుతున్నారని కొందరు భర్తలు హెల్ప్ లైన్కు ఫోన్ చేసి వాపోతున్నారట. అంతేకాదు.. వారి భార్యలు తమ తల్లిదండ్రులతో సరిగా మెదలడంలేదని, అలాగే అత్తల పోరు రానురాను మరీ ఎక్కువైపోతోందనివారు వాపోతున్నారట. ఎలాగైనా తమ భార్యలకు మంచి మార్గదర్శకాలు సూచించి వారిలో మార్పు తీసుకురావాలని వారు కోరుతున్నారని వివరించారు.
గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఫోన్ కాల్స్ మొత్తం 7,919 ఉండగా.. వాటిల్లో మహిళలు ఫిర్యాదు చేసినవి 5,718 కాగా, పురుషుల చేసినవి 1,201. అయితే, కేవలం మహిళల కోసం ఏర్పాటుచేసిన ఈ హెల్ప్ లైన్ పురుషుల సమస్యలు పరిష్కరించాలని తాము అనుకోవడం లేదని అధికారులు అంటున్నారు కానీ.. విషయం తీవ్రంగానే ఉందని వారు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more