పులి అంటే భయపడని వారు ఎవరైనా ఉంటారా. పులి చుట్టు పక్కల తిరుగుతుందని తెలిస్తేనే అటు వైపు వెళ్లడం మానేస్తాం. పులైనా. సింహమైనా మనిషికి చచ్చేంత భయం. అవి జూ బోనులో ఉన్నా, దూరం నుండి చూస్తు ఆశ్చర్యపోతుంటాం. మరి ఇలాంటి భయంకర జంతువులను పెంపుడు జంతువులుగా పెంచుకునే అవకాశం ప్రజలకు కల్పించాలని ఎవరైనా అంటే ఏం చేస్తారు. అదేంటి ఇలా కూడా ఎవరైనా అడుగుతారా అనుకుంటున్నారా... అయినా ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ పూర్తిగా చదవాల్సిందే.
పులులను, సింహాలను పెంచుకునేందుకు వీలుగా చట్టాలను మార్చాలని మధ్య ప్రదేశ్కు చెందిన ఓ మంత్రి వింత ప్రతిపాదన చేశారు. దేశంలో పులులు, సింహాల సంఖ్య రోజురోజుకూ తగ్గుతున్నందున వాటిని సంరక్షించుకుంటూ వాటి సంతతిని వృద్ధి చేసేందుకు పెట్స్గా పెంచుకునే అవకాశం ఇవ్వాలని సూచించారు. మధ్యప్రదేశ్ లో యానిమల్ హస్బెండరీ, హార్టికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిగా కుసుమ్ మెదాలే పనిచేస్తున్నారు. ఆఫ్రికా, దక్షిణాసియాలోని థాయిలాండ్ వంటి దేశాల్లో క్రూర మృగాలను పెట్స్గా పెంచుకునేలా చట్టాలు ఉన్నాయని ఆమె చెప్పారు. ఈ మేరకు మన చట్టంలో కూడా మార్పులు తీసుకురావాలని కుసుమ్ మెదాలే అటవీశాఖకు లేఖలు రాయటం విశేషం. మధ్యప్రదేశ్ లో 6 టైగర్ రిజర్వ్స్ ఉండగా, వాటిలో 257 పులులు ఉంటున్నాయి. 2010 సంవత్సరం లో 1706గా ఉన్న పులుల సంఖ్య 2014 నాటికి 2,226కు పెరిగిందని తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తానికి పులులు, సింహాల సంఖ్యను ఇంకా పెంచాలంటే, ఇలా వాటిని పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని సదరు మంత్రి గారు అభిప్రాయపడుతున్నారు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more