Actress nagari ysrcp mla roja controversial comments on tdp party leaders ministers and pawan kalyan

nagari mla roja, actress roja, roja hot photos, roja cleavage tattoo, roja tattoo, roja latest interview, roja latest interview, pawan kalyan, roja pawan kalyan, roja latest photos, tdp party ministers, tdp party leaders, chandrababu naidu

actress nagari ysrcp mla roja controversial comments on tdp party leaders ministers and pawan kalyan : actress nagari mla roja suggesting tdp party ministers to pray pawan kalyan photos

పవన్ ఫోటోకు పూజలు చేయమంటున్న నటి-ఎమ్మెల్యే రోజా!

Posted: 09/05/2014 11:05 AM IST
Actress nagari ysrcp mla roja controversial comments on tdp party leaders ministers and pawan kalyan

(Image source from: actress nagari ysrcp mla roja controversial comments on tdp party leaders ministers and pawan kalyan)

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫాలోయింగ్ టాలీవుడ్ లో ఎంతుందో అందరికీ తెలిసిన విషయమే! మిగతావారి సంగతేమోగానీ.. ఈయన అభిమానులైతే పవన్ ను దేవుడితో సమానంగా పోల్చుతుంటారు. మరికొంతమందైతే ఈయన ఫోటోను తమ ఇంట్లో పెట్టుకుని పూజలు కూడా చేస్తూ వుంటారు. ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే.. పవన్ సినిమా రిలీజ్ అవుతున్నరోజు ఆయన ఫ్లెక్సీలను, కటౌట్ లకు, పోస్టర్లకు పాలాభిషేకం చేసి, సినిమా విజయవంతంగా కొనసాగాలని పూజలు చేస్తారు. అదీ పవన్ లో వున్న అసలైన పవర్! ఈయన పవనిజం కేవలం అభిమానుల్లోనే కాదు.. రాజకీయ నాయకులు, సీనిప్రముఖుల్లో సైతం బాగానే వుంది. తెలుగుచిత్రపరిశ్రమలో వున్న సీనియర్ నటీనటులు సైతం ఈయనకు వీరాభిమానులు వున్నారు. వీరి జాబితాలో నటి రోజా కూడా ఒకరు! పవన్ కల్యాణ్ అంటే తనకెంతో ఇష్టమని గతంలో చాలాసార్లు స్టేట్ మెంట్లు కూడా ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ఆయన ఫోటోకు పూజలు చేయాల్సిందిగా సూచనలు ఇస్తోంది!

అయితే ఈసారి ఆమె ఇలా సూచనలు ఇస్తోంది అభిమానులుకైతే కానేకాదు.. టీడీపీవర్గాలారికి! టీడీపీ పార్టీలో వున్న నేతలంతా పవన్ కల్యాణ్ ఫోటో పెట్టుకుని పూజలు చేయాలంటూ ఆమె సూచనలను జారీ చేస్తోంది. ఒకప్పుడు టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకుని కొన్నాళ్లపాటు ఆ పార్టీలో చెలామణి అయిన నటి రోజా... తర్వాత వైఎస్ఆర్ మరణానంతరం వైకాపాలోకి చేరిపోయిన సంగతి తెలిసిందే! ఇక అప్పటినుంచి మొదలుకొని ఇప్పటివరకు ఈమెకూడా టీడీపీ పార్టీపై రకరకాల విమర్శలు, ఆరోపణలు చేస్తూ వస్తున్న విషయం విదితమే! ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైకాపా తరఫున నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజా.. తాజాగా మరోసారి టీడీపీ పార్టీ నేతలపై ధ్వజమెత్తింది.

హైదరాబాద్ లోని మీడియా సమావేశంలో మాట్లాడిన నటి-ఎమ్మెల్యే రోజా... సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తప్పుడు హామీలు, ప్రచారాలు చేస్తూ ప్రజలను మోసం చేసిందని విమర్శనాస్త్రాలు చేసింది. టీడీపీలో వున్న నేతలకు ఎన్నికల్లో గెలుపొందే సత్తాలేకపోవడం వల్లే పవన్ కల్యాణ్ కాళ్లు పట్టుకుని వాళ్లు మద్దతు కోరారని... ఆయన టీడీపీకి మద్దతుగా ప్రచారాలు చేయడం వల్లే నేడు ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆమె ఎద్దేవా చేశారు. పవన్ వల్లే పార్టీ గెలిచింది కాబట్టి.. టీడీపీ నేతలంతా ఆయన ఫోటో పెట్టుకుని పూజలు చేయాలని సూచనలను జారీ చేసింది. అలాగే.. పార్టీ అధికారంలోకి రాగానే టీడీపీ నేతలందరూ ఊసరవెల్లిలా రంగులు మారారని ఆమె ఆరోపణలు చేశారు. పదేళ్లు ప్రతిపక్షంలో వున్న విషయాన్ని ఆ పార్టీ నేతలు మర్చిపోయారా అంటూ గుర్తు చేశారు. టీడీపీ నిజస్వరూపమేంటో ప్రజలు త్వరలోనే గుర్తించే రోజులు వస్తాయని ఆమె వెల్లడించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles