ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీకి హిందుత్వ స్టాంప్ వేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అంతకు ముందు కూడా కాషాయ రాజకీయాలొద్దంటూ భాజపాకి చురకలంటించే ప్రయత్నం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీయే. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ భాజపా విధానాలను హైందవంగా చూడవద్దని చెప్తోంది. వింతగా లేదూ
భారతదేశంలో హిందువులు మెజారిటీ లో ఉన్నప్పుడు మైనార్టీ వర్గాల గురించే ఎక్కువగా మాట్లాడుతుంటే మెజారిటీ వర్గాలు చివరకు చిక్కకుండా పోతారని ఊహించని కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాజకీయంగా చిక్కుల్లో పడ్డట్టుగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. హైందవ ముద్ర వేసుకున్న భాజపా ఆ విధంగా మెజారిటీలోకి పోతే కాంగ్రెస్ మైనారిటీ వర్గాల వోట్లను కూడా పూర్తిగా పొందలేకపోయిందని 2014 ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి.
ఉమాభారతి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గంగా పరిరక్షణ ప్రణాళికను హైందవవాదుల ప్రాజెక్ట్ గా తీసుకోవద్దని, అది జాతీయ ప్రాజెక్టని కాంగ్రెస్ పార్టీ నాయకుడు జైరాం రమేష్ అన్నారు.
దానితో భాజపా జాతీయవాద పార్టీ అని కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తున్నట్లుగా అయింది. అంతకు ముందు దేశసౌభాగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని భాజపా ముందుకు నడుస్తుందని అంటే, కాదు అది కేవలం హిందుత్వ వాదనతోనే పనిచేస్తుందని, హిందూ వివక్షతోనే ప్రణాళికలు వేస్తుందని కాంగ్రెస్ నాయకులన్నారు. తద్వారా మైనార్టీ వర్గాల వోట్లను చేజిక్కించుకోవచ్చన్నది వాళ్ళ అభిప్రాయం. అందులో కొంత సాధించినా మెజార్టీ వర్గాలను పోగుట్టుకోవటం జరిగిందన్న వేదన ఇప్పుడు పట్టుకున్నట్లుగా జైరాం రమేష్ మాటల్లో తెలుస్తోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more