ఢిల్లీ లో విద్యార్థిని మీద సామూహిక అత్యాచారం చేసిన వారిలో తిహార్ జైల్లో ఉన్న ప్రధాన నిందితుడు రాంసింగ్ కొన్ని రోజులుగా మనస్తాపంలో ఉన్నట్టుగా కనిపించాడని అంటున్నారు. అందువలన అతను ఆత్మహత్య చేసుకునే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగానే పహరా కాస్తున్నారు. అయినా రాం సింగ్ కాపలా దారుల కళ్ళు, అదే సెల్ లో ఉన్న ఇతర ఖైదీల కళ్ళు కప్పి తన వంటి మీద దుస్తులతో ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ సంఘటన మీద పలువురు విమర్శలు చేసారు. తిహార్ జైల్ కి ఒకప్పుడు డైరెక్టర్ జనరల్ గా పనిచేసి కిరణ్ బేదీ, ఆ ఖైదీ అందరి కళ్ళను ఎలా కప్పి అఘాయిత్యానికి పాల్పడ్డాడో విచారణలోనే తేలుతుంది కాబట్టి వేచి చూడవలసిందే అన్నారు. తప్పించుకునే దార్లన్నీ మూసుకునిపోయాయి అని అనుకున్నప్పుడే ఖైదీలు అలాంటి పని చేస్తారు. మరి అటువంటి ఖైదీ మీద ఇ-వాచ్ లేదా హెచ్-వాచ్ లు ఎంత సమర్ధవంతంగా ఏర్పాటు చేసారన్నది చూడవలసి వుంది అని ఆవిడ అన్నారు. అధిక ప్రమాణంలో జరిగిన ప్రచారం మూలకంగా ఖైదీని జైలు లోపల బయటా కూడా అందరూ బహిష్కరించారు అని తన అభిప్రాయాన్ని తెలియజేసారు.
జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు మమతా శర్మ, విచారణలో ఉన్న ఖైదీమీద నిఘా పెట్టలేకపోయారు. దీని మీద దర్యాప్తు చెయ్యాలి అన్నారు. మెట్రో పోలిటన్ మేజిస్ట్రేట్ ఈ సంఘటన మీద విచారణ చెయ్యబోతున్నారని అనధికారిక వార్త వినవస్తోంది.
ఈ సంఘటన తెలియగానే రాంసింగ్ కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. రాంసింగ్ తమ్ముడు, ఈ కేసు విచారణ త్వరగా ముగియాలనే కోరుకున్నామని, ఈ వార్త షాక్ కలిగించినా మాకు బాధ అనిపించటం లేదని అన్నాడు. ఇందులో అనుమాన పడవలసిన విషయం ఉన్నట్టుగా తామేమీ భావించటం లేదని కూడా అతను అన్నాడు. అంటే రాంసింగ్ ఆత్మహత్య చేసుకునే ఉంటాడని వాళ్ళు అనుకుంటున్నారు. అన్న మీద కేసు చాలా బలంగా ఉండటమే అందుకు కారణమై వుంటుందని అతనన్నాడు.
రాం సింగ్ ది క్రిమినల్ బుర్ర కాబట్టి, తనకు కావలసిన పనికి అవకాశం కోసం కనిపెట్టటం, దానికోసం ఎదురు చూడటం ఇలాంటివి చెయ్యగలుగుతాడు. పైగా అవమాన భారంతో కలిగిన మానసిక వత్తిడి అందుకు ప్రేరేపించి వుంటుందంటున్నారు విశ్లేషకులు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more