రాష్ట్ర చేనేత, జౌళీ శాఖ మంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే, వివాదాల మంత్రిగా పేరొందిన శంకర్రావు ముఖ్యమంత్రి పై విమర్శలు, సెటైర్లు వేయడం మాత్రం మానుకోవడంలేదు. జూబ్లిహాలులో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో కూడా ముఖ్యమంత్రిపై సెటైర్లు వేశారు. సమస్యలపై మాట్లాడదామంటే అధికారులు సమయానికి దొరకట్లేదని మంత్రి శంకర్రావు వాపోయారు. "హైదరాబాదీలు ఉదయం పదయితే గానీ లేవరు... రాత్రి ఏడు దాటితే దొరకరు. ఇది నాకు ఇబ్బందికరంగా ఉంది. మా పాలమూరికి వెళ్లిపోతా'' అని ఆయన వ్యాఖ్యానించారు. తాను హైదరాబాదీనే అని చెబుతున్న సీఎంకూ ఇది వర్తిస్తుందా అని విలేకరులు ప్రశ్నించారు. దానికి.. "ఏం.. ముఖ్యమంత్రి కిరణ్ ఎక్కడ పుట్టాడు? ఎక్కడ పెరిగాడు? ఎక్కడ చదివాడు? హైదరాబాద్లో కాదా? ...'' అని వ్యంగ్యాస్త్రం వదిలారు.
దీనికి అక్కడున్న విలేఖరులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈయన ఎక్కడున్నా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మామూలేనని అనుకున్నారు.
జూబ్లిహాలులో జరుగుతున్న సమావేశం మన మంత్రులకు మంచి వినోద ప్రాంతంగా ఉంది. ఇక్కడికి అందరు మంత్రులు రావడంతో ఆ సమావేశం ‘గెట్ టుగెదర్’ లాగా తయారయింది. సమస్యలపై చర్చించడం తక్కువ – తిండి గురించి ఆలోచించడం ఎక్కువ’’ గా ఉంది అక్కడి పరిస్థితి. శంకర్దాదా ఎంబీబీఎస్... రాగి సంకటి, నాటు కోడి పులుసు రుచిచూశావా..? అని మంత్రి రఘువీరా రెడ్డి శంకర్ రావును అడిగాడు. అందుకు ఆయన . నాటు కోడి పులుసు... రాగి సంకటి రుచి చూశా కానీ... నేను దొంగ డాక్టర్ను కాదు. అసలైన డాక్టర్ను. కావాలంటే నా సర్టిఫికెట్ చూపిస్తా అంటూ శంకర్రావు వ్యాఖ్యానించారు. పనిలో పనిగా వీరితోపాటు ఉన్న మరో మంత్రి శైలాజానాథ్ కూడా తామంతా శంకర్దాదా ఎంబీబీఎస్లం కాదని...ఒరిజినల్ డాక్టర్లమంటూ వ్యాఖ్యానించారు. సమావేశాలు నిర్వహించమంటే సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు ప్రజాప్రతినిధులు అని ప్రజలు అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more