భారత స్టార్ షట్లర్ పీవీ సింధూకి టోక్యో ఒలింపిక్స్ ముంగిట ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల స్విట్జర్లాండ్ వేదికగా ముగిసిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పీవీ సింధు విజేతగా నిలవడంలో క్రియాశీలక పాత్ర పోషించిన సహాయ కోచ్ కిమ్ జి హూన్ వ్యక్తిగత కారణాలతో తాజాగా రాజీనామా చేసింది. 2020 టోక్యో ఒలింపిక్స్కి ఇక 11 నెలల వ్యవధి మాత్రమే ఉండగా.. ఈ సమయంలో కిమ్ ఇలా రాజీనామా చేయడం పీవీ సింధూ ఆటపై ప్రభావం చూపే అంశమే.
దక్షిణ కొరియాకి చెందిన 45 ఏళ్ల కిమ్కి కోచ్గా సుదీర్ఘ అనుభవం ఉంది. 1989లో బ్యాడ్మింటన్ వరల్డ్ జూనియర్ గర్ల్స్ టైటిల్ గెలిచిన కిమ్.. ఆ తర్వాత 1994 ఆసియా గేమ్స్లో బంగారు పతకాన్ని గెలుపొందింది. 1996, 2000 ఒలింపిక్స్లోనూ సత్తాచాటిన కిమ్ 2001లో రిటైర్మెంట్ ప్రకటించి.. ఆ తర్వాత కోచ్గా క్రీడాకారుల్ని తీర్చిదిద్దుతోంది. బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కోసం పీవీ సింధూతో పాటు భారత షట్లరని సిద్ధం చేసే క్రమంలో గత కొన్ని నెలలుగా కిమ్ భారత్లో ఉండిపోయింది.
అయితే.. ఇటీవల ఆమె భర్తకి గుండెపోటురాగా.. తాజాగా సర్జరీ చేయాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో.. కిమ్ తన భర్త దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుని కోచ్ పదవికి రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కిమ్ రాజీనామాతో చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్పై అదనపు భారం పడనుంది. సింధూతో పాటు సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్ తదితరులకి శిక్షణ ఇస్తున్న గోపీచంద్కి ఇన్నిరోజులూ సహాయ కోచ్గా కిమ్ పనిచేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more