ద్రాక్షారామము
పంచరామాల్లో నాల్గో క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ద్రాక్షారామం.. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రికి 47 కి.మీ. దూరంలో ఉన్న రామచంద్రాపురంలో వుంది. ఇక్కడ దక్ష ప్రజాపతి అనేక యజ్ఞాలు చేశాడు కనుకనే ఈ ప్రదేశాన్ని దక్షరామం అని కూడా పిలుస్తారు. ఇక్కడ స్వామి భీమేశ్వరునిగా కొలువై ఉన్నాడు. ఇక్కడ ఉన్న భీమేశ్వర లింగం 15 అడుగుల ఎత్తు కంటే ఎక్కువగా ఉండి, సగం తెలుపు, సగం నలుపు రంగులో ఉంటుంది.