చార్మినార్
హైదరాబాద్ నగరంలో వున్న చారిత్రాత్మక కట్టడాల్లో చార్మినార్ ఒకటి. మహమ్మద్ కులీ కుతుబ్ షా అనే రాజు 1591వ సంవత్సరంలో ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా ఈ నాలుగు మీనార్లు కలిగిన కట్టడాన్ని నిర్మించాడు. నిజానికి దీనిని ఒక మసీదుగాగానీ, మద్రాసుగాగానీ మలచాలనే యోచనతో నిర్మించాడు. ఇది హైదరాబాద్ పాతబస్తీలో వుంది. ఇది చారిత్రాత్మక కట్టడం కావడం వల్ల దీని చుట్టూ వున్న ప్రాంతానికి చార్మినార్ ప్రాంతంగా గుర్తింపు లభించింది.