ఒరిస్సా రాష్ట్రంలోని మూడు ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ‘గోపాల్పూర్’ ఒకటి. ఇది ఒరిస్సాలోని దక్షిణ సరిహద్దులైన్లపై వున్న ఒక కోస్తా పట్టణం. ఇది బంగాళఖాతానికి చాలా సమీపంలో వుండడంవల్ల ఎంతో ప్రసిద్ధి చెందింది.
కాలంతో సమయం లేకుండా పర్యాటకులు ఇక్కడ ఎల్లప్పుడూ విహరిస్తూ కనిపిస్తారు. దీనిని చాలామంది స్వర్గ పర్యాటక ప్రదేశంగా పేర్కొంటారు.
ఒకనాడు ఈ ప్రాంతం సముద్రతీరంలో వుంది గనుక మత్స్యకారుల ప్రదేశంగా పిలువబడేది. అయితే బ్రిటీష్ వారు అప్పట్లో ఈ ప్రాంతాన్ని ఆక్రమించి, వర్తకవ్యాపార కేంద్రంగా మార్చేసుకున్నారు. అప్పటినుంచి ఇది రేవుపట్టణంగా పరగణించబడుతోంది.
ఈ ప్రాంతం ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో వుంది కాబట్టి, ఒరిస్సాలో జరిగే రోజువారి వ్యాపారాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతాయి. అలాగే దక్షిణ రాష్ట్రాలతో కూడా ఈ వ్యాపార సంబంధాలు ఒకదానితోఒకటి పరస్పరంగా సహకరించుకుంటాయి.
ఈ ప్రదేశంలో ఆకర్షణీయమైన ఇతర ప్రాంతాలు కూడా చాలా వున్నాయి. మాతారా తరిణి హిల్ మందిరం, బాలాకుమారి ఆలయం, శ్రీశ్రీశ్రీ సిద్ధివినాయక పీఠంతోపాటు ఎంతో ఆధ్యాత్మికమైన, ధార్మిక ప్రదేశాలు ఇక్కడ చూడటానికి ఆకర్షణీయంగా వుంటాయి. అంతేకాదు... సోనెపూర్ బీచ్, అర్యపల్లి బీచ్, గోపాల్పూర్ బీచ్ వంటి ప్రాంతాలను సందర్శించడానికి వేలాదిమంది ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. అందువల్ల దీనిని ఒక స్వర్గవిహార ప్రదేశం అంటారు.
గోపాల్పూర్ ప్రాంతం సాధారణంగా సంవత్సరంపొడవునా సందర్శించడానికి చాలా ఆహ్లాదకరంగానే వుంటుంది. అయితే చాలామంది అక్టోబర్ నుంచి ఏప్రిల్ మధ్యలోనే పర్యటించేందుకు ఎక్కువ మక్కువ చూపిస్తారు.
గోపాల్పూర్ ప్రాంతంలో షాపింగ్ చేయడానికి చాలా షాపింగ్ మాల్స్ అనుకూలంగా వుంటాయి. పిల్లలకు కావల్సిన ఆటబొమ్మలనుంచి ఆడవాళ్లకు అవసరమైన పట్టుచీరలు, ఆభరణాలవరకు అనేక రకాలు తక్కువ ధరలకే దొరుకుతాయి.
కాబట్టి ఇటువంటి ప్రాంతాన్ని జీవితంలో ఒక్కసారైనా విహరించాలని అందరూ ఆసక్తిగా వుంటారు.
(And get your daily news straight to your inbox)
Apr 24 | ప్రస్తుతకాలంలో వాహనాల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. యుక్తవయస్కుల నుంచి 60 ఏళ్లు పైబడినవారు కూడా ప్రతిఒక్కరు కారును నడుపుతున్నారు. అదేవిధంగా యాక్సిడెంట్లు కూడా ఎక్కడబడితే అక్కడ జరుగుతున్నాయి. అయితే తాజాగా నిర్వహించిన సర్వేల్లో.. యాక్సిడెంట్లలో... Read more
Mar 24 | ఆధ్యాత్మిక ప్రదేశాల నుంచి ఎంతో సుందరమైన ప్రకృతి దృశ్యాలదాకా గుజరాత్ రాష్ట్రం నానాటికీ అభివృద్ధి చెందుతూనే వుంది. సంస్కృతి సంప్రదాయాలపరంగా, వ్యాపారపరంగా, విహరించడానికి అనుగుణంగా ఈ ప్రదేశం ప్రతిఒక్కరిని ఆకర్షిస్తూనే వుంది. ప్రముఖ నటుడయిన... Read more
Mar 21 | మన భారతదేశంలో వున్న అన్ని ప్రదేశాలలో గర్వించదగ్గ ప్రాంతాలలో దేశ రాజధాని అయిన ఢిల్లీ ఒకటి. ఇక్కడికి విహరించడానికి ప్రపంచంలోని అనేక దేశాల పర్యాటకులు విచ్చేస్తుంటారు. ఢిల్లీలో ఆకర్షించే ప్రాంతాలు చాలానే వున్నాయి. ఢిల్లీ... Read more
Mar 17 | మొత్తం ప్రపంచంలోనే భారతదేశంలో ఎంతో అద్భుతమైన హిమాలయ శ్రేణుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రాంతం ఎప్పుడూ పర్యాటకులతో నిండి వుంటుంది. చిన్న, పెద్ద, వయస్సుతో ఎటువంటి తేడా లేకుండా ప్రతిఒక్కరు... Read more
Mar 13 | దక్షిణ భారతదేశంలోనే ప్రయాణికులకు ‘‘వెల్లూర్’’ ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తించబడింది. ఈ ప్రాంతంలో పురాతనకాలం నుంచి వున్న కట్టడాలు, దేవాలయాలు, ద్రావిడ నాగరికతలను సంబంధించిన చారిత్రాత్మక కట్టడాలు ఇక్కడ వున్నాయి. హిందూ సంస్కృతీ,... Read more