ఇండియన్ స్టార్ షట్లర్ కు పీవీ సింధుకు షాక్ తగిలింది. రియో ఒలంపిక్స్ లో రజత పథకం సాధించిన తెలుగమ్మాయికి రెండు తెలుగు రాష్ట్రాలు బహుమతులను ప్రకటించాయి. అయితే అమెకు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రస్తుతం థాయ్ లాండ్ ఓపెన్ టార్నోమెంటులో క్వార్టర్ ఫైనల్ లోకి దూసుకెళ్లిన సింధూ.. మరో టైటిల్ తన ఖాతాలో వేసుకునేందుకు రెండడుగుల దూరంలో వుండగా, అమెకు రెండో తెలుగు రాష్ట్రం తెలంగాణ నుంచి మాత్రం చుక్కెదురైంది.
రియో ఒలంపిక్స్ గెలిచిన సందర్భంగా ప్రోత్సహకంగా తనకు తెలంగాణ ప్రభుత్వం అందించిన వెయ్యి గజాల స్థలం పక్కన వున్న మరో 398 గజాల స్థలాన్ని తనకు అదనంగా కేటాయించాలని అమె రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టుకున్న అర్జీని తెలంగాణ ప్రభుత్వం నిర్ద్వందంగా తోసిపుచ్చుతూ నిర్ణయం తీసుకుంది. సింధూకు మరో గజం స్థలాన్ని కూడా కేటాయించలేమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన సింధుకు... హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని భరణి లేఔట్ లో 1000 గజాల స్థలాన్ని కేటాయించింది.
దీని విలువ దాదాపు రూ. 15 కోట్లు. దీనికి తోడు, రూ. 5 కోట్ల నజరానాను కూడా అందించింది. తనకు ఇచ్చిన స్థలం పక్కనే ఉన్న 398 గజాల స్థలాన్ని కూడా తనకు కేటాయించాలంటూ కొన్నాళ్ల క్రితం ప్రభుత్వానికి ఆమె దరఖాస్తు చేసుకుంది. అయితే, ఆమె విన్నపాన్ని తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది. ఏపీ ప్రభుత్వం కూడా ఆమెకు స్థలంతో పాటు, నగదు బహుమతిని, డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని ఇచ్చిందని... ఈ నేపథ్యంలో, ఇరు రాష్ట్రాల నుంచి ప్రయోజనాలను పొందిన ఆమెకు... అదనంగా స్థలం ఇవ్వాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కార్యాలయం భావించినట్టు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more