ఇండియన్ క్రికెట్ టీమ్కు కోచ్ను వెతికే పనిలో ఉంది బీసీసీఐ. టీ20 వరల్డ్కప్తో రవిశాస్త్రి పదవీకాలం ముగుస్తుండటంతో అతని స్థానంలో కొత్త కోచ్ ఎవరన్న ఆసక్తి నెలకొంది. ద్రవిడ్, కుంబ్లేల పేర్లు వినిపించినా.. వాళ్లిద్దరూ దీనికి సుముఖంగా లేరని తేలడంతో విదేశీ కోచ్ ఖాయమని అనుకున్నారు. అయితే తాజాగా బీసీసీఐ వర్గాలు మాత్రం విదేశీ కోచ్ వచ్చే అవకాశమే లేదని చెప్పడం గమనార్హం. రానున్న హెడ్ కోచ్ కూడా ఇండియాకు చెందిన వాళ్లే ఉంటారని ఆ వర్గాలు తెలిపాయి.
నిజానికి ఐపీఎల్లోని 8 ఫ్రాంచైజీల్లో ఏడింటికి విదేశీ కోచ్లే ఉన్నారు. అయితే నేషనల్ టీమ్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఈ ఫార్ములా పనిచేయదని బోర్డు వర్గాలు అంటున్నాయి. కొత్త హెడ్ కోచ్ ఇండియనే. ఐపీఎల్తో పోలిస్తే ఇండియన్ టీమ్ కోచింగ్ జాబ్ పూర్తిగా భిన్నమైనది. ఏడాది మొత్తం టీమ్తోనే ఉండాలి. ఆ విషయం చూస్తే ఇండియన్ కోచే బెటర్ అని ఆ వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం ఐపీఎల్లో విజయవంతమైన కోచ్లుగా పేరున్న రికీ పాంటింగ్, మహేల జయవర్దెనెలాంటి వాళ్లు అంత సమయం ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
గతంలో నలుగురు విదేశీయులు ఇండియన్ టీమ్ కోచ్గా చేశారు. మొదట జాన్ రైట్, తర్వాత గ్రెగ్ చాపెల్, గ్యారీ కిర్స్టెన్, డంకన్ ఫ్లెచర్ కోచ్లుగా ఉన్నారు. మరోవైపు కుంబ్లే కోచ్గా తిరిగి వచ్చే అవకాశం లేదని కూడా బీసీసీఐ స్పష్టం చేసింది. గతంలో 2016-17 సమయంలోనూ కుంబ్లే కోచ్గా చేశాడు. అయితే కోహ్లితో పడక కుంబ్లే తన పదవికి రాజీనామా చేశాడు. ఇప్పుడు కూడా కోహ్లి కెప్టెన్గా ఉండటంతో కుంబ్లే వచ్చే అవకాశాలు లేవని ముందు నుంచీ వార్తలు వస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more