అంతర్జాతీయ క్రికెట్ కౌన్సి ర్యాంకింగ్ విధానంలో తీసుకువచ్చిన మార్పులతో టీమిండియా టెస్టు ర్యాంకింగ్ లలో తన నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయింది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానాన్ని కైవసం చసుకుంది. కాగా అసీస్ తరువాత అధ్యధిక పాయింట్లతో రెండో స్థానాన్ని న్యూజిలాండ్ సొంతం చేసుకుంది. కివీస్ తరువాత మూడవ స్థానాన్ని భారత్ అక్రమించింది, దీంతో గత మూడున్నరేళ్లుగా టాప్ ర్యాంకులో కొనసాగుతున్న టీమిండియా.. తాజాగా తొలి స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయింది.
తాజా ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా 116, న్యూజిలాండ్ 115, ఇండియా 114 పాయింట్లతో ఒకదానికికొకటి పోటీగా వున్నా.. ఈ మూడు దేశాల మధ్య కేవలం ఒక్కోక్క పాయింట్ మాత్రమే వత్యాసంగా వున్నా.. అధిక పాయింట్లతో అసీస్ జట్టు అగ్రబాగన కొనసాగుతోంది. 2016 నుంచి టెస్టు ర్యాంకింగ్స్ లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. 2016-17లో భారత్ 12 టెస్టులు గెలుపొంది, ఒక టెస్టును కోల్పోయింది. అయితే ఆ రికార్డులను తొలగిస్తున్నట్టు ఐసీసీ ప్రకటించింది.
తాజా ర్యాంకింగ్స్ కోసం 2019 మే నుంచి ఆడిన మ్యాచులు 100 శాతం, అంతకు ముందు రెండేళ్ల మ్యాచులకు సంబంధించి 50 శాతం రేటింగ్ పాయింట్లను ఆధారంగా తీసుకున్నారు. దీంతో, భారత్ అగ్ర స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయింది. కరోనా కారణంగా మ్యాచులు జరగకపోవడం కూడా భారత్ కు ప్రతికూలంగా మారింది. ఇక ఇదే ప్రాతిపదికన తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్ లలోనూ టీమిండియా మూడో స్థానానికే పరిమితమైంది. ఆసీస్ తొలి స్థానంలో ఉంది. వన్డేల్లో ఇంగ్లాండ్ తొలి స్థానంలో ఉండగా... భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more