రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చేస్తోంది. వరుసల విజయాలతో హ్యాట్రిక్ సాధించడంతో ఆర్సీబీ అభిమానులకు ప్లే ఆఫ్స్పై ఆశలు చిగురిస్తున్నాయి. బుధవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. చావోరేవో అన్నట్లుగా సాగిన మ్యాచ్లో విజయయం సాధించి ఊపిరి పీల్చుకుంది. అట్టడుగు స్థానాన్ని రాజస్థాన్కు అప్పజెప్పి పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకింది. అయితే, మ్యాచ్ అనంతరం ఆ జట్టు సారథి విరాట్ కోహ్లీ మీడియాతో వరస విజయాలపై స్పందించారు.
‘వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడటం మమ్మల్ని ఎంతో బాధించింది. కానీ, మా ఆటగాళ్లు ఎవరూ ఆ ఒత్తిడిలో కుంగిపోలేదు. ఆటను ఆస్వాదించాలని నిర్ణయించుకున్నాం. మేం ఎలా ఆడామన్నది మాకు తెలుసు. ప్రపంచానికి కూడా తెలుసు. జట్టుగా ఆడటం మంచి ఫలితాలను తెచ్చి పెడుతుందని మేం నమ్మాం. మేము చివరగా ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగింట్లో విజయాలు సాధించాం. ఆ ఒక్కదాంట్లో కూడా గెలిచి ఉండాల్సింది. అయితే, క్రికెట్ను ఎంత ఆస్వాదిస్తూ ఆడితే అంత ప్రయోజనం ఉంటుందని అన్నారు.
ఈ రోజు మ్యాచ్లో మా జట్టు ఆటతీరే అందుకు ఉదాహరణ అని అన్నారు. స్టొయినీస్, డివిలియర్స్ కలిసి మ్యాచ్కు మంచి పునాది వేశారు. 175 పరుగుల లక్ష్యం నిర్దేశించగలిగితే చాలు అనుకున్న సమయంలో వాళ్లిద్దరూ చెలరేగి 200 పరుగుల మైలురాయి దాటించారు. ఈ విజయంలో కీలక పాత్ర వాళ్లదే’ అని కోహ్లీ పేర్కొన్నాడు. ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే మిగిలిన మూడు మ్యాచుల్లోనూ కచ్చితంగా గెలిచి తీరాలి. తన తర్వాతి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడాల్సి ఉంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more