వివాదాస్పద వ్యాక్యలు చేయడంతో కీలకంగా మారిన శ్రీలంక మాజీ సారథి అర్జున రణతుంగ మరోమారు అచ్చంగా అలాంటి వాఖ్యలే చేసిన టీమిండియా జట్టు అభిమానులతో పాటు యావత్ దేశప్రజల అగ్రహానికి గురవుతున్నాడు. ఐదో వన్డేల సిరీస్లో భాగంగా భారత్-శ్రీలంక మధ్య మూడో వన్డే జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. తమ జట్టు ఓటమి అంచుల్లో ఉన్న సమయంలో శ్రీలంక అభిమానులు ఆగ్రహంతో మైదానంలోకి బాటిళ్లు విసరడంతో సుమారు 35 నిమిషాల పాటు అంపైర్లు ఆటను నిలిపివేశారు.
ఈ ఘటనపై మాజీ క్రికెటర, మంత్రి అర్జున రణతుంగ స్పందించారు. ‘క్యాండీలో భారత్-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచులో అభిమానులు వాటర్ బాటిల్స్ విసిరి నిరసన వ్యక్తం చేసినట్లు తెలిసింది. లంక అభిమానులు కాస్త ఓర్పుతో ఉండాలి. సంయమనం పాటించాలి. ఇలాంటి సంఘటనలను పునరావృతం చేయవద్దు. లంక ప్రజలు క్రికెట్ ని ప్రేమిస్తారు. మేము మ్యాచ్ ఓడిపోయినప్పుడు వారెంతో బాధకు గురవుతారు. క్రికెట్ కోసం ఎన్నో వదులుకున్నాం. వరుస ఓటములతో జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.
ఈ సందర్భంగా క్రికెట్ అభిమానుల్ని ఒకటే కోరుతున్నాను. దయచేసి భారత ప్రేక్షకుల్లా ప్రవర్తించొద్దు. మనకంటూ మంచి చరిత్ర, సంస్కృతి ఉంది. ఇలాంటి ప్రవర్తనను మన చరిత్ర, సంస్కృతి ఒప్పుకోదు’ అని రణతుంగ అన్నాడు. 1996లో ప్రపంచకప్ సెమీస్లో ఈడెన్ గార్డెన్లో భారత్-లంక జట్లు తలపడ్డాయి. భారత్ వరుస వికెట్లు కోల్పోతుండటంతో అభిమానులు వాటర్ బాటిల్స్ విసిరి, ప్లకార్డులు తగలబెట్టి గొడవ చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే రణతంగ పైవిధంగా వ్యాఖ్యలు చేశాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more