England beat New Zealand to reach semi-finals సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్న అతిధ్య జట్టు

Champions trophy 2017 england beat new zealand to reach semi finals

champions trophy 2017, ICC Champions Trophy 2017, england, australia, bangladesh, new zealand, icc group a teams, cricket news, cricket, sports news, latest news

England are into the semi-finals of the Champions Trophy after beating New Zealand by 87 runs with an accomplished all-round display.

ఛాంపియన్స్ ట్రోఫి: సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్న అతిధ్య జట్టు

Posted: 06/07/2017 12:00 PM IST
Champions trophy 2017 england beat new zealand to reach semi finals

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో అతిథ్య జట్టు జోరు కొనసాగిస్తుంది. అన్ని విభాగాల్లో పట్టుతో దూకుడుగా సాగుతున్న అతిథ్య జట్టు ఇంగ్లాండ్.. ఆడిన రెండు మ్యాచ్ లలో విజయాలను సోంతం చేసుకుని అప్పుడే సెమీస్ బెర్త్ ను ఖాయం చేసుకుంది. దీంతో ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో సెమీస్ కు అర్హత సాధించిన తొలి జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ఏ విభాగంలో వున్న ఇంగ్లాండ్.. టోర్నీలో భాగంగా ఈ నెల 1న జరిగిన తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడిన అతిథ్య జట్టు 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.

ఇక గత రాత్రి కార్డిఫ్ లోని సోఫియా గార్డెన్స్ లో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో తలపడిన ఇంగ్లండ్ జట్టు, అన్ని విభాగాల్లో సమష్టిగా రాణించి సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టులో రూట్ (65 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 64 పరుగులు), బట్లర్ (48 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 61 పరుగులు), హేల్స్ (62 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 56 పరుగులు), స్టోక్స్ (53 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 48 పరుగులు) రాణించడంతో 49.3ఓవర్లలో 310 పరుగులు చేయగలిగింది.

311 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టులో వన్ డౌన్ బ్యాట్స్ మన్ విలియమ్సన్ 87 పరుగులతో రాణించినా, మరెవరూ తమ స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోవడంతో 44.3 ఓవర్లకే 223 పరుగులకు ఆలౌటైంది. దీంతో 2 మ్యాచ్ లు ఆడి రెండు విజయాలు సాధించిన ఇంగ్లండ్ జట్టు సెమీస్ కు చేరుకుంది. అయితే అసీస్ జోరుకు వరుణుడు అడ్డుగా నిలవడంతో.. ఆ జట్టు సెమీస్ లోకి అడుగుపెడుతుందా..? లేదా అన్న అనుమానాలు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్ లు వరుణుడు స్వాహ చేయడంతో కేవలం రెండు పాయింట్లను మాత్రమే రాబట్టుకుంది. దీంతో గ్రూప్ ఏ విభాగం నుంచి సెమీస్ కు వెళ్లే రెండో జట్టు కోసం అస్ట్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Champions Trophy  england  australia  bangladesh  new zealand  icc group a teams  cricket  

Other Articles