ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అతిథ్య జట్టు జోరు కొనసాగిస్తుంది. అన్ని విభాగాల్లో పట్టుతో దూకుడుగా సాగుతున్న అతిథ్య జట్టు ఇంగ్లాండ్.. ఆడిన రెండు మ్యాచ్ లలో విజయాలను సోంతం చేసుకుని అప్పుడే సెమీస్ బెర్త్ ను ఖాయం చేసుకుంది. దీంతో ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో సెమీస్ కు అర్హత సాధించిన తొలి జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ఏ విభాగంలో వున్న ఇంగ్లాండ్.. టోర్నీలో భాగంగా ఈ నెల 1న జరిగిన తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడిన అతిథ్య జట్టు 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.
ఇక గత రాత్రి కార్డిఫ్ లోని సోఫియా గార్డెన్స్ లో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో తలపడిన ఇంగ్లండ్ జట్టు, అన్ని విభాగాల్లో సమష్టిగా రాణించి సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టులో రూట్ (65 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 64 పరుగులు), బట్లర్ (48 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 61 పరుగులు), హేల్స్ (62 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 56 పరుగులు), స్టోక్స్ (53 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 48 పరుగులు) రాణించడంతో 49.3ఓవర్లలో 310 పరుగులు చేయగలిగింది.
311 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టులో వన్ డౌన్ బ్యాట్స్ మన్ విలియమ్సన్ 87 పరుగులతో రాణించినా, మరెవరూ తమ స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోవడంతో 44.3 ఓవర్లకే 223 పరుగులకు ఆలౌటైంది. దీంతో 2 మ్యాచ్ లు ఆడి రెండు విజయాలు సాధించిన ఇంగ్లండ్ జట్టు సెమీస్ కు చేరుకుంది. అయితే అసీస్ జోరుకు వరుణుడు అడ్డుగా నిలవడంతో.. ఆ జట్టు సెమీస్ లోకి అడుగుపెడుతుందా..? లేదా అన్న అనుమానాలు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్ లు వరుణుడు స్వాహ చేయడంతో కేవలం రెండు పాయింట్లను మాత్రమే రాబట్టుకుంది. దీంతో గ్రూప్ ఏ విభాగం నుంచి సెమీస్ కు వెళ్లే రెండో జట్టు కోసం అస్ట్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more