హిమాచల్ ప్రదేశ్ వేదికగా ధర్మశాలలోని స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మద్య జరుగుతున్న ఆఖరుటెస్టు మ్యాచ్ లో తొలిరోజు టీమిండియా అసీస్ పై ఆధిపత్యం ప్రదర్శించింది. అసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ శతకంతో రాణించినా.. అతనికి తోడుగా వార్నర్ కూడా అర్థశతంతో తొలిఇన్నింగ్స్ లో అసీస్ గౌరవప్రదమైన స్కోరుకు చేరుకునేందుకు దోహదపడ్డారు. అయితే 54 టెస్టులతో తరువాత కోహ్లీ లేకుండా.. అజ్యింక రహానే నేతృత్వంలో మైదానంలోకి దిగిన టీమిండియా జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఒకటి రెండు సార్లు తడబడ్డా అద్బుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది.
తొలి మ్యాచ్ లోనే తన అద్బుత ప్రదర్శనతో నాలుగు వికెట్లు తీసిన కుల్ దీప్ యాదవ్ మ్యాచ్ కే హైలైట్ గా నిలిచాడు. అసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కు మ్యాచ్ ప్రారంభంలోనే లైఫ్ లభించడంతో ఆయన అర్ధ సెంచరీ సాధించాడు. టాస్ ఓడి ఫీల్డింగ్ ప్రారంభించిన భారత జట్టు ఆరంభంలోనే బ్రేక్ అందుకుంది. రెండో ఓవర్ లో ఉమేష్ యాదవ్ రెన్ షా (1) వికెట్ తీసి షాక్ ఇచ్చాడు. అనంతరం క్రీజులో అద్భుతంగా కుదురుకుని భారీ స్కోరుపై కన్నేసిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ (111), వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (56) రాణిస్తున్న సమయంలో కుల్ దీప్ యాదవ్, వార్నర్ ను పెవిలియన్ కు పంపాడు.
అనంతరం స్మిత్ కు జత కలిసిన షాన్ మార్ష్ (8) ను ఉమేష్ యాదవ్ బోల్తా కొట్టించాడు. అనంతరం వచ్చిన హ్యాండ్స్ కొంబ్ (4) ను కుల్ దీప్ అద్భుత బంతితో బలిగొన్నాడు. తరువాత క్రీజులోకి వచ్చిన మ్యాక్స్ వెల్ (8) ను మరో అద్భుత బంతితో పెవిలియన్ కు పంపాడు. అనంతరం సెంచరీతో కదం తొక్కిన స్మిత్ (111) ను అశ్విన్ అవుట్ చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆ తరువాత వచ్చిన కుమ్మిన్స్ (21)ను కుల్ దీప్ యాదవ్ అవుట్ చేశాడు. ఆ తరువాత ఒకీఫ్ (8)ను సబ్ స్టిట్యూట్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ విసిరిన బంతితో కీపర్ సాహా రన్ అవుట్ చేశాడు.
అనంతరం క్రీజులో కుదురుకుని టీమిండియా బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన మాథ్యూ వేడ్ (57) ను జడేజా బౌల్డ్ చేశాడు. చివర్లో లియాన్ (13)ను పుజారా చక్కని క్యాచ్ తో అవుట్ చేశాడు. దీంతో హాజిల్ వుడ్ (2) నాటౌట్ గా నిలిచాడు. దీంతో మొత్తం 88.3 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా జట్టు 300 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ను ముగించింది. భారత్ బౌలర్లలో కుల్ దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో రాణించగా, రెండు వికెట్లతో ఉమేష్ యాదవ్ ఆకట్టుకున్నాడు. అశ్విన్, జడేజా, భువనేశ్వర్ కుమార్ చెరొక వికెట్ తీసి వారికి చక్కని సహకారం అందించారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more