ఆస్ట్రేలియా-భారత్ జట్ల టెస్టు సిరీస్ లో భాగంగా ముగిసిన తొలి రెండు టెస్టుల్లో ఆటగాళ్ల మధ్య తరుచు చోటు చేసుకున్న స్లెడ్జింగ్ ప్రమాదకర స్థాయిలో ఉందని ప్రముఖ వ్యాఖ్యాత ఇయాన్ చాపెల్ స్పష్టం చేశాడు. క్రికెట్ ఫీల్డ్ లో శ్రుతి మించిపోతున్న ఈ తరహా చర్యలను ఆపడానికి ఆయా క్రికెట్ బోర్డులు నడుంబిగించాల్సిన అవసరం ఉందన్నాడు. ఇక నుంచి ఆటగాళ్ల ఆన్ ఫీల్డ్ ఘటనలపై బోర్డు అధికారులు కఠినంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందన్నాడు.
'గతంలో ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ల్లో కూడా ఆటగాళ్లు స్లెడ్జింగ్ చేసుకున్న ఘటనలు అనేకం. అయితే ఆ దూకుడు ఎప్పుడూ పరిధిలోనే ఉండటంతో క్రికెట్ కు మంచే జరిగేది. ఇప్పడు మాత్రం ఆటగాళ్ల ఆన్ ఫీల్డ్ వ్యవహారాలు తీవ్రస్థాయిలో ఉంటున్నాయి. వారి కారుకూతులకు స్టేడియంలో అంపైర్లు, ప్రేక్షకులే సాక్ష్యం. వారి పిచ్చి కూతలకు ఇకనైనా ఫుల్ స్టాప్ పెట్టండి. ఒకవేళ బోర్డు అధికారులు ఈ తరహా చర్యలను చూస్తూ కూర్చుంటే అది వారి చేతకానితనమే అవుతుంది' అని చాపెల్ పేర్కొన్నాడు. ఇటీవల రెండో టెస్టు సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యహరించిన తీరును చాపెల్ తప్పుబట్టాడు. ఒకసారి విరాట్ తన ఎమోషన్స్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందంటూ హితబోధ చేశాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more