అస్ట్రేలియాలోని గబ్బా స్టేడియం వేదికగా పర్యాటక జట్టు పాకిస్తాన్ తో జరిగిన తొలి టెస్టులో ఉత్కంఠకర పోరులో ఆతిథ్య జట్టు ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది. అది నుంచి మ్యాచ్ పై పట్టుబిగించిన అథిథ్యజట్టు.. మరో రోజు అట మిగిలివుండగానే గెలుపును కైవసం చేసుకుంది. రసవత్తరంగా సాగిన డే అండ్ నైట్ టెస్టులో ఆస్ట్రేలియా కేవలం 39 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. ఆసీస్ విసిరిన 490 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్ పోరాడి ఓడింది. తొలి ఇన్నింగ్స్ లో పెద్దగా ప్రభావాన్ని చాటకుండా వరుసగా వెనుదిరిగిన పాకిస్థాన్ జట్టు.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం అద్భుత ప్రతిభను కనబర్చింది.
ఇవాళ జరిగిన ఆటలో 450 పరుగుల వద్ద పాక్ ఆలౌట్ కావడంతో అసీస్ ను విజయం వరించింది. పాక్ ఆటగాడు ఆసద్ షఫిక్ శతకంతో రాణించాడు. 207 బంతులను ఎదుర్కొన్న అతడు.. ఒక సిక్స్, పదమూడు ఫోర్ల సాయంతో 137 పరుగులతో చివరి వరకూ పోరాడినా జట్టును మాత్రం ఓటమి తీరాల నుంచి గట్టెక్కించలేకపోయాడు. పాక్ స్కోరు 449 పరుగుల వద్ద షఫిక్ తొమ్మిదో వికెట్ గా అవుట్ కావడంతో మరో పరుగు మాత్రమే చేసి పాక్ తన రెండో ఇన్నింగ్స్ ను ముగించింది.
అంతకుముందు 382/8 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన పాక్ మరో 68 పరుగులు జోడించి రెండు వికెట్లను నష్టపోయింది. ఈ రోజు ఆటలో షఫిక్ దాదాపు 21.0 ఓవర్ల పాటు క్రీజ్ లో ఉన్నా మ్యాచ్ ను రక్షించలేకపోయాడు. స్టార్క్ వేసిన ఓవర్ లో వార్నర్ క్యాచ్ కు అవుటయ్యాడు. దాంతో పాక్ ఓటమి ఖాయమైంది. స్టార్క్ వేసిన అదే ఓవర్ లో యాసిర్ షా అనవసర పరుగు కోసం యత్నించి రనౌట్ కావడంతో పాక్ పరాజయం చెందింది. పాక్ చివరి వికెట్ పడిన అనంతరం ఆసీస్ ఆనందం అవధులు దాటింది. స్వదేశంలో జరిగిన మ్యాచ్ లో ఆసీస్ కడవరకూ పోరాడి గెలవడంతో ఆ జట్టు ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. ఈ మ్యాచ్ లో విజయంతో ఆసీస్ సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more