ప్రపంచంలో అత్యంత ధనికులైన క్రికెటర్లలో టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. కానీ.. అంతా కలిసి ఎక్కడైనా పార్టీకి వెళ్లారో, అసలు జేబులోంచి డబ్బులు తీయడం అంటే మనోడికి మహా కష్టమట. ఈ విషయం చెప్పింది కూడా వాళ్లూ వీళ్లూ కారు.. సాక్షాత్తు జట్టు సీనియర్ సభ్యుడు యువరాజ్ సింగ్!! ఒక రేడియో చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ మాట్లాడుతూ కోహ్లీ పిసినారితనాన్ని బయటపెట్టాడు. తామంతా ఎప్పుడు కలిసి వెళ్లినా.. తానే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని, ఎప్పుడైనా కోహ్లీతో డబ్బులు ఇప్పించాలంటే అతడిని చాలా బలవంతం చేయాల్సి ఉంటుందని అన్నాడు.
ఇక జట్టులో ఉన్న మరో పిసినారి.. ఆశిష్ నెహ్రా అట. చాలా కాలం తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చి మెరుపులు మెరిపించిన ఈ సీనియర్ బౌలర్ కూడా డబ్బులు తీయమంటే మహా బాధపడిపోతాడని యువరాజ్ అంటున్నాడు. ఏమైనా అంటే.. తనకు పెళ్లాం పిల్లలు ఉన్నారని, అందువల్ల ఎక్కువ ఖర్చుపెట్టలేనని బీద అరుపులు అరుస్తాడట. వీళ్లిద్దరితో పాటు ఇంకా చాలామంది టీమిండియా క్రికెటర్లకు జేబులోంచి డబ్బులు తీయడం అంటే బాగా ఇబ్బందిగానే ఉంటుందని, అయితే అందరి పేర్లూ బయట పెట్టడం బాగోదని చెప్పాడు. కోహ్లీ, నెహ్రాలతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా వాళ్లిద్దరి గురించి మాత్రం కాస్తంత ఎక్కువగా చెప్పినట్లున్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more