ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంటులో భాగంగా గ్రూపు-బీలో హామిల్టన్ వేదికగా ఐర్లాండ్ తో జరుగిన మ్యాచ్ లో భారత్ ఐర్లాండ్ పై అలవోక విజయాన్ని నమోదు చేసింది. ఐర్లాండ్పై భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐర్లాండ్ నిర్దేశించిన 260 పరుగుల లక్ష్యాన్ని36.5 ఓవర్లలో ఛేదించి గ్రూప్ బిలో ఐదో వరుస విజయాన్ని నమోదు చేసి అగ్రస్థానంలో నిలిచింది. విరాట్ కోహ్లి అద్భుతమైన కవర్ డ్రైవ్తో భారత్ని విజయతీరాలకు చేర్చాడు.
ఐర్లాండ్ నిర్ధేశించిన 260 పరుగుల విజయలక్ష్యాన్ని ధోణి సేన ఇంకా 13.1 ఓవర్లు మిగిలి వుండగానే చేధించింది. కేవలం 36.5 ఓవర్లలోనే భారత్ సునాయాసంగా విజయతీరాలకు చేరింది. భారత ఓపెనర్ శిఖర్ ధావన్ కేవలం 84 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో సాధించిన సెంచరీ.. సాధించి మరో ఘనతను సాధించాడు. ప్రపంచ క్రికెట్ కప్ టార్నమెంటులో భారత్ తరపున వేగంగా సెంచరీ సాధించిన రెండో అటగాడిగా నిలిచాడు. గతంలో ప్రపంచకప్ టోర్నీలో సచిన్ సాధించినట్లుగానే కేవలం 84 బంతుల్లో శిఖార్ సెంచరీ సాధించి.. సచిన్ రికార్డును సమం చేశాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ కూడా ప్రపంచ కప్ టోర్నమెంటులో ఫామ్ లోకి వచ్చి.. మెరుగైన ఆటతీరుతో 66 పరుగులను సాధించాడు.
వీరిద్దరూ ఔవుట్ అయిన తరువాత క్రీజ్ లోకి వచ్చిన రహానే, కోహ్లీ.. దూకుడుగా ఆడుతూ.. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా టీమిండియాను విజయాలకు చేర్చారు. కోహ్లీ 42 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్ తో రాణించి 44 పరుగులను సాధించగా, అజింక్య రహానే 28 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 33 పరుగులు సాధించాడు. రహానె, కోహ్లి, 70 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఐర్లాండ్ బౌలర్లలో స్టువార్ట్ దాంప్సన్ మాత్రమే రెండు విక్కట్లను లభించాయి. ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న భారత్ మార్చి 14న జింబాబ్వేతో ఆఖరి లీగ్ మ్యాచ్లో తలపడనుంది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లలో మరో ఓవర్ మిగిలి వుండగానే అలౌవుట్ అయ్యింది. పోర్టర్ ఫీల్డ్, ఎన్ ఒబ్రియాన్ అర్ధసెంచరీలతో రాణించడంతో భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఐర్లాండ్ చాలెంజింగ్ స్కోరు సాధించింది. టీమిండియాకు 260 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. పోర్టర్ ఫీల్డ్ 93 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ తో 67 పరుగులు చేశాడు. పాల్ స్టిర్లింగ్ తో కలిసి పోర్టర్ ఫీల్డ్ శుభారంభం అందించాడు. 89 పరుగులు వద్ద స్టిర్లింగ్(42) అవుటవడంతో వీరి భాగస్వామ్యానికి తెర పడింది.
తర్వాత ఒబ్రియాన్ విజృంభణతో ఐర్లాండ్ స్కోరు పరుగులు పెట్టింది. ఒబ్రియాన్ 75 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 75 పరుగులు చేశాడు. 206 పరుగుల వద్ద బాల్బెరిని(24) నాలుగో వికెట్ గా అవుటయిన తర్వాత ఐర్లాండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో ఐర్లాండ్ భారీ స్కోరు చేయలేకపోయింది. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ 2 వికెట్లు తీశారు.జడేజా, ఉమేష్ యాదవ్, మొహిత్ శర్మ తలో వికెట్ తీశారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more