Indian won by 8 wickets against ireland

india versus ireland, india vs ireland, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, india, india CWC 2015, Live Scores, Live Updates, ireland, ireland CWC 2015, Sports, World Cup Live, shikar dhawan, rohit sharma, sachin tendulkar

shikar dhawan fastest century made india easy win againt ireland by 8 wickets

పసికూనపై అలవోక విజయం సాధించిన ధోణి సేన

Posted: 03/10/2015 04:41 PM IST
Indian won by 8 wickets against ireland

ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంటులో భాగంగా గ్రూపు-బీలో హామిల్టన్ వేదికగా ఐర్లాండ్ తో జరుగిన మ్యాచ్ లో భారత్ ఐర్లాండ్ పై అలవోక విజయాన్ని నమోదు చేసింది. ఐర్లాండ్‌పై భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐర్లాండ్ నిర్దేశించిన 260 పరుగుల లక్ష్యాన్ని36.5 ఓవర్లలో ఛేదించి గ్రూప్ బిలో ఐదో వరుస విజయాన్ని నమోదు చేసి అగ్రస్థానంలో నిలిచింది. విరాట్ కోహ్లి అద్భుతమైన కవర్ డ్రైవ్‌తో భారత్‌ని విజయతీరాలకు చేర్చాడు.

ఐర్లాండ్ నిర్ధేశించిన 260 పరుగుల విజయలక్ష్యాన్ని ధోణి సేన ఇంకా 13.1 ఓవర్లు మిగిలి వుండగానే చేధించింది. కేవలం 36.5 ఓవర్లలోనే భారత్ సునాయాసంగా విజయతీరాలకు చేరింది. భారత ఓపెనర్ శిఖర్ ధావన్ కేవలం 84 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో సాధించిన సెంచరీ.. సాధించి మరో ఘనతను సాధించాడు. ప్రపంచ క్రికెట్ కప్ టార్నమెంటులో భారత్ తరపున వేగంగా సెంచరీ సాధించిన రెండో అటగాడిగా నిలిచాడు. గతంలో ప్రపంచకప్ టోర్నీలో సచిన్ సాధించినట్లుగానే కేవలం 84 బంతుల్లో శిఖార్ సెంచరీ సాధించి.. సచిన్ రికార్డును సమం చేశాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ కూడా ప్రపంచ కప్ టోర్నమెంటులో ఫామ్ లోకి వచ్చి.. మెరుగైన ఆటతీరుతో 66 పరుగులను సాధించాడు.

వీరిద్దరూ ఔవుట్ అయిన తరువాత క్రీజ్ లోకి వచ్చిన రహానే, కోహ్లీ.. దూకుడుగా ఆడుతూ.. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా టీమిండియాను విజయాలకు చేర్చారు. కోహ్లీ 42 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్ తో రాణించి 44 పరుగులను సాధించగా, అజింక్య రహానే 28 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 33 పరుగులు సాధించాడు. రహానె, కోహ్లి, 70 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఐర్లాండ్ బౌలర్లలో స్టువార్ట్ దాంప్సన్ మాత్రమే రెండు విక్కట్లను లభించాయి. ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న భారత్ మార్చి 14న జింబాబ్వేతో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో తలపడనుంది.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లలో మరో ఓవర్ మిగిలి వుండగానే అలౌవుట్ అయ్యింది. పోర్టర్ ఫీల్డ్, ఎన్ ఒబ్రియాన్ అర్ధసెంచరీలతో రాణించడంతో భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఐర్లాండ్ చాలెంజింగ్ స్కోరు సాధించింది. టీమిండియాకు 260 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. పోర్టర్ ఫీల్డ్ 93 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ తో 67 పరుగులు చేశాడు. పాల్ స్టిర్లింగ్ తో కలిసి పోర్టర్ ఫీల్డ్ శుభారంభం అందించాడు. 89 పరుగులు వద్ద స్టిర్లింగ్(42) అవుటవడంతో వీరి భాగస్వామ్యానికి  తెర పడింది.

తర్వాత ఒబ్రియాన్ విజృంభణతో ఐర్లాండ్ స్కోరు పరుగులు పెట్టింది. ఒబ్రియాన్ 75 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 75 పరుగులు చేశాడు. 206 పరుగుల వద్ద బాల్బెరిని(24) నాలుగో వికెట్ గా అవుటయిన తర్వాత ఐర్లాండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో ఐర్లాండ్ భారీ స్కోరు చేయలేకపోయింది. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ 2 వికెట్లు తీశారు.జడేజా, ఉమేష్ యాదవ్, మొహిత్ శర్మ తలో వికెట్ తీశారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc criket world cup 2015  India  Ireland  

Other Articles